‘గత ఐదేళ్ల నుంచి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్స్ తగ్గాయి. అడ్మిషన్స్ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలి. అడ్మిషన్లను పెంచేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ఉన్నత విద్యా సంస్థల వివరాలు, మౌలిక సదుపాయాలు, అడ్మిషన్లు, కోర్టు కేసుల వివరాలను డ్యాష్ బోర్డులో పొందుపర్చాలి. ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజులు ఏ మేరకు ఉండాలి, రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల పనితీరు, అప్రెంటీస్ షిప్ ఎంబేడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ కోసం కాలేజీల ఎంపిక గురించి చర్చ జరిగింది అని’ మంత్రి నారా లోకేశ్ తేల్చి చెప్పారు. ఇదే కాక ఆంధ్రప్రదేశ్లో శ్రీ పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు అంశాలపై మంత్రి నారా లోకేశ్ సమీక్షించారు.