రోడ్డు ప్రమాదానికి గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన దొనకొండ మండలంలోని రామాపురం గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. అందిన వివరాల మేరకు... రామాపురం గ్రామానికి చెందిన పెమ్మసాని నాగేశ్వరరావు(48) అతని భార్య వెంకటరమణ ద్విచక్ర వాహనంపై కొచ్చెర్లకోటలోని ఆర్ఎంపీ వైద్యశాలలో వైద్యం పొంది తిరిగి సొంతూరు వెళ్తున్నారు. అదే గ్రామానిక చెందిన ఎం శివరామకృష్ణ తన ద్విచక్ర వాహనంపై రామాపురం నుంచి వేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలు కాగా అతని భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108 వాహనంలో మార్కాపురం ప్రైవేట్ వైద్యశాలకు తరలించగా వైద్యం పొందుతూ నాగేశ్వరరావు మృతి చెందినట్లు సమాచారం. మృతిచెందిన నాగేశ్వరరావుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై సంపత్కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa