బాపట్ల జిల్లా చీరాల మండలం వాడరేవుకు చెందిన పెదాల వెంకటేశ్వర్లు అలియాస్ వెంకీ జల్సాలకు బాగా అలవాటుపడ్డాడు. కూలీపనులు ద్వారా సంపాదించిన మొత్తం తన అవసరాలకు, వ్యసనాలకు సరిపోవడంలేదు. ఈజీగా డబ్బులు సంపాదించాలని మాస్టర్ ప్లాన్ చేశాడు. వెంటనే నెట్లో ఓపెన్ చేసి సినిమాల్లో రైళ్లలో దొంగతనాలు చేసే సీన్లు బాగా చూసేవాడు. వెంటనే ఓ రైలు ఎక్కేవాడు.. ఆ ప్లాన్ను అమలు పరిచి చోరీలు చేస్తున్నాడు.
ఇలా అప్పటి నుంచి రైళ్లల్లో తిరుగుతున్న వెంకటేశ్వర్లు.. ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలో వారి బ్యాగ్లు, బంగారు ఆభరణాలు, ల్యాప్టాప్, మొబైల్స్, ఇతర విలువైన వస్తువుల్ని చోరీ చేసేవాడు. ఇటీవల చీరాలలో రైలు దొంగతనాలు పెరగడంతో గుంతకల్లు రైల్వే జిల్లా ఎస్పీ ఆదేశాలతో మూడు జిల్లాల అధికారులు నిఘా పెంచారు.. అతడిపై ఫోకస్ పెట్టి సాంకేతికత ఆధారంగా నిందితుడు వెంకటేశ్వర్లును గుర్తించారు.
వెంకటేశ్వర్లును గురువారం రాత్రి చీరాల రైల్వేస్టేషన్లో నాలుగో నంబర్ ప్లాట్ఫారంపై రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర నుంచి రూ.3.81 లక్షల విలువచేసే 62 గ్రాముల బంగారం, ఐదు మొబైల్స్, నాలుగు ల్యాప్టాప్లు, ఐప్యాడ్, మూడు వాచ్లను సీజ్ చేశారు. మనోడి సినిమా స్టైల్ చోరీల గురించి తెలిసి అందరూ అవాక్కయ్యారు.
మరోవైపు ప్రకాశం జిల్లాలో విషాదం జరిగింది.. తవ్విన మట్టి గుంతల్లో పడి ఓ యువకుడు చనిపోగా, మరొకరు గల్లంతయ్యారు. టంగుటూరు మండలం వల్లూరు గ్రామ శివారు బీడు భూముల్లో మట్టిని తవ్వేశారు. కొన్ని చోట్ల 20 అడుగుల లోతున మట్టి తవ్వి ఒంగోలు, ఇతర ప్రాంతాలకు తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. తాజా వర్షాలకు అలా తవ్వి వదిలేసిన గుంతల్లోకి నిండా నీరు చేరింది. టంగుటూరు మండలంలోని వాసేపల్లిపాడుకు చెందిన నల్లమలపు నవీన్, బాణాల వెంకటేశ్ గురువారం ఈత కొట్టేందుకు అక్కడి గుంతల్లోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరు ముగినిపోయారు.. వీరు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెతకగా, వల్లూరు చెరువు దగ్గర గుంతలో నవీన్ మృతదేహం లభించింది. వెంకటేశ్ కోసం రాత్రి వరకూ గాలించి, చీకటి పడటంతో నిలిపివేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa