‘వోక్మైండ్ వైరస్’ వల్లే తన కొడుకు దూరమయ్యాడని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భావోద్వేగానికి గురయ్యారు. పిల్లల లింగమార్పిడి ప్రక్రియను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తనను మభ్యపెట్టి లింగమార్పిడి శస్త్రచికిత్స కోసం సంతకం చేయించారని మస్క్ తెలిపారు.
‘‘నన్ను మభ్యపెట్టి నా కుమారుడి లింగమార్పిడికి నాతోనే సంతకం చేయించారు.. ప్రపంచమంతా కరోనా కారణంగా అల్లకల్లోలంగా మారడంతో నా మనసు అంతా గందరగోళంగా ఉండేది.. లింగమార్పిడి జరగకపోతే ఆత్మహత్య చేసుకొనే ప్రమాదం ఉందని చెప్పారు.. ముందు నుంచి వాస్తవాలు దాచిపెట్టారు.. ఇది ఓ రకంగా స్టెరిలైజేషన్ లాంటిందని చెప్పారు.. ఇది చాలా దుర్మార్గం. దీనిని ప్రోత్సహిస్తున్న వారిని జైలుకు పంపాలి’ అని మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వోక్మైండ్ వైరస్ వల్లే కుమారుడు తనకు దూరమయ్యాడని ఆవేదనకు గురయ్యారు.
సామాజిక సమస్యలపై అతిగా స్పందించడం అనే ఉద్దేశంతో వోక్మైండ్ వైరస్ అనే పదాన్ని మస్క్ ఉపయోగించారు. మాజీ భార్య జస్టిన్ విల్సన్తో 2008లో మస్క్ విడాకులు తీసుకోగా.. ఈ దంపతులకు జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్పిన్ అనే ఇద్దరు కుమారులున్నారు. వీరిలో జేవియర్ నాలుగేళ్ల కిందట లింగమార్పడితో అమ్మాయిగా మారారు. తన తండ్రితో కలిసి జీవించకపోవడం వల్ల ఆయన ఆకారం లేదా ఇతర ఏ రూపంలోనూ ఎటువంటి సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు వివియన్ జెనా విల్సన్గా మారిన జేవియర్ వెల్లడించారు. అతడు టీనేజ్లో ఉండగానే ఇలా జరిగింది.
అయితే, జేవియర్ నిర్ణయంపై గతంలో ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. లింగమార్పిడి హక్కులను పరిమితం చేసే చట్టాలకు మద్దతిస్తోన్న రిపబ్లికన్ పార్టీకి తాను మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. దీనికి ముందు 2020లోనూ ఇదే అంశంపై ఎలాన్ మస్క్ ట్వీట్ చేస్తూ.. ట్రాన్స్జెండర్లకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కానీ, వారి పేర్లను మార్చుకోవడం మాత్రం ఓ అందమైన పీడకలే అంటూ వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa