ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలనుండి అర్జీలను స్వీకరించిన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 03, 2024, 03:35 PM

ప్రజా సమస్యలను వినేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ప్రజల వద్ద నుంచి వినతి పత్రాలు, పార్టీ శ్రేణుల నుంచి అర్జీలను సీఎం స్వీకరించారు. ఈ సందర్భంగా సీఎంను కలిసి వినతి పత్రాలు సమర్పించేందుకు పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో అర్జీదారులు తరలివచ్చారు. ముందుగా దివ్యాంగుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి చంద్రబాబు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ ఒక్కరి సమస్యలు పరిష్కరిస్తామని వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. కాగా.. టీడీపీ శ్రేణులు గడిచిన 50 రోజులుగా 10 వేలకుపైగా అర్జీలు తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa