ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఖిల ప‌క్ష సమావేశాని జనసేన దూరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 29, 2019, 11:16 PM

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం అఖిల పక్షాలు, వివిధ ప్రజా సంఘాలతో   సమావేశం ఏర్పాటు  చేయడం హర్షణీయ‌మే అయినా ఈ స‌మావేశానికి దూరంగా ఉండాని జ‌న‌సేన నిర్ణ‌యించింది. ఈ మేర‌కు జ‌న‌సేన కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ప‌వ‌న్ సంత‌కంతో విడుద‌లైన ఈ లేఖ‌లో అఖిల‌ప‌క్ష స‌మావేశానికి  నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. అయితే బుధవారం సమావేశం ఏర్పాటు చేసి, మంగళవారం సాయంత్రం ఆహ్వానం పంపడం ఆక్షేపణీయంమ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.  క‌నీస‌ సమయం ఇవ్వకుండా,సమావేశం పూర్తి స్థాయి ఎజెండాను నిర్ణయించకుండా ఏర్పాటు చేసిన‌ ఈ సమావేశం కేవలం మొక్కుబడి మాత్ర‌మే అనిపిస్తోందని, దీనివెన‌క అధికార పార్టీ రాజకీయ లబ్ది కోసం  అన్న సందేహాలను రేకెత్తిస్తున్న‌ట్టు పేర్కొన్నారు.. ప్రత్యేక హోదా,విభజన హామీల సాధన కోసం  సంఘటితంగా పోరాటం చేయడానికి జనసేన పార్టీ కట్టుబడివుందని, అయితే ఆ పోరాటంలో   చిత్తశుద్ధి వున్నప్పుడు మాత్రమే  జనసేన ఎవ‌రితో అయినా చేతులు కలుపుతుంది మిన‌హా ఇలా .మొక్కుబడి సమావేశాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వవని ప‌వ‌న్ స్ప‌ష్టం చేస్తూ, తాము ఈ స‌మావేశానికి హాజ‌రు కావ‌టం లేద‌ని తేల్చి చెప్పారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa