అమరావతి: వైసీపీపై మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ పెద్ద డ్రామా పార్టీగా అభివర్ణించారు. జగన్.. కేసీఆర్తో కలిసి చంద్రబాబును విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ ప్రజలను తిట్టిన కేసీఆర్తో కలిసి జగన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. అభివృద్ధిని అడ్డుకోవడమే వైసీపీ నేతల పని అని మండిపడ్డారు. టీడీపీని విమర్శించడానికే వైసీపీ పోటీ సభలు పెడుతోందని చెప్పుకొచ్చారు. వైసీపీ అభిమాని జగన్ను పొడిస్తే.. ఆ నింద టీడీపీపై వేశారన్నారు. ఏపీ పోలీసులు చెప్పిందే ఎన్ఐఏ కూడా చెప్పిందని గుర్తుచేశారు.
లోటు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ను ఇచ్చారని తెలిపారు. అయినా 56 లక్షల కుటుంబాలకు పెన్షన్ ఇస్తున్నామని వెల్లడించారు. చంద్రబాబు వచ్చాక 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని వివరించారు. రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని ప్రకటించారు. చంద్రబాబుపై ఉన్న నమ్మకంతో ఎంతో మంది వచ్చి ఏపీలో పరిశ్రమలు పెడుతున్నారని స్పష్టంచేశారు. కేంద్రం సహకరించడం లేదని.. ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మోదీ భయపడాలే తప్ప.. సీఎం ఎప్పుడూ భయపడరన్నారు. రేపటి అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల నేతలు రావాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa