ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాళ్లు క‌న్నాలు, సున్నాలు వేసే నేత‌లు: యామిని

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 30, 2019, 01:32 AM

మేడిన్ జర్మనీ, మేడిన్ జపాన్ తరహాలో ఇకపై మేడిన్ ఏపీ అనే నినాదం రానుందని తెదేపా అధికార ప్రతినిధి సాదినేని యామిని అన్నారు. అనంతపురం జిల్లాలో కియా కార్ల తయారీతో సరికొత్త చరిత్రకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా వాళ్లు కర్రీ పాయింట్లు పెట్టుకోవాలన్న కేసీఆర్ ఇపుడేం మాట్లాడతారని ప్రశ్నించారు. చంద్రబాబు దూరదృష్టి వల్లే రాయలసీమ ఇప్పుడు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. రాయలసీమలో పుట్టి పెరిగిన జగన్... సీమకు ఏం చేస్తారో ఎప్పుడైనా చెప్పగలిగారా అని ప్రశ్నించారు. అమరావతిని స్వాధీనం చేసుకుంటామని, సహజ వనరులు కొల్లగొడుతున్నారని మరో నేత ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని పవన్‌కళ్యాణ్ ని ఉద్దేశించి విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధి అంతా కేంద్రానిదేనని చెప్పేందుకు భాజపా నేతలు నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. గోడలకు కన్నాలు, సున్నాలు వేసుకునే నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. మేడిన్ ఇండియా అంటూ మోడీ తిరిగిన దేశాలెన్ని? ఎన్ని కంపెనీలు తెచ్చారని యామిని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa