ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీపై వివక్షను మరోసారి బయటపెట్టిన కేంద్ర బడ్జెట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 02:51 PM

కేంద్రంలోని మోడీ సర్కార్ ఏపీపై వివక్ష చూపుతున్నదన్న విషయాన్ని కేంద్ర తాత్కాలిక విత్తమంత్రి పియూష్ గోయెల్ ఈ రోజు లోక్ సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్ మరోసారి రుజువు చేసింది. గత రెండు రోజులుగా ఈ మధ్యంతర బడ్జెట్ లో ఏపీకి రైల్వే జోన్ ప్రకటిస్తారంటూ బీజేపీ నేతలు చేసిన హడావుడి అంతా ఉత్తిదేనని రుజువు చేస్తూ పీయూష్ గోయెల్ బడ్జెట్ లో రైల్వే జోన్ ఊసే ఎత్తలేదు. ఇది ఒక్కటే కాదుు…పోలవరం ప్రాజెక్టుకు నిధులు, కడప స్టీల్ ప్లాంట్, రాష్ట్రానికి పన్ను రాయితీలు, విభజన చట్టంలోని హామీలు ఇలా వేటి గురించీ కనీస ప్రస్తావన కూడా లేదు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa