ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కారులో వ్యాపారవేత్త మృతదేహం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 01, 2019, 02:52 PM

విజయవాడ: కృష్ణా జిల్లా కీసర వద్ద కారులో అనుమానాస్పద స్థితిలో వ్యాపారవేత్త మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడిని హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌కు చెందిన చిగురుపాటి జయరామ్‌గా గుర్తించారు. కోస్టల్‌ బ్యాంకు డైరెక్టర్‌, హెమారస్‌ ఫార్మా కంపెనీ ఎండీగా ఆయన పనిచేస్తున్నారు. జయరామ్‌ ఎక్స్‌ప్రెస్‌ టీవీ ఛైర్మన్‌గానూ కొన్నాళ్లపాటు కొనసాగారు. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. జయరామ్‌ కుటుంబం ప్రస్తుతం అమెరికాలో నివాసముంటుండగా.. ఆయన తల్లిదండ్రులు విజయవాడ కానూరులో ఉంటున్నారు. ఆర్థికపరమైన వివాదాలే ఈ ఘటనకు కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. రెండ్రోజుల క్రితం జయరామ్‌ హైదరాబాద్‌ నుంచి విజయవాడ బయల్దేరినట్లు.. ఆయనతో పాటు మరో వ్యక్తి కూడా కారులో ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కారులో మద్యం సీసాలను పోలీసులు గుర్తించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa