ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో అనుమతులు లేని స్థలాలు, ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని నగరపాలక సంస్థ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కార్పొరేషన్ పరిధిలోని పేర్నమిట్ట, ముక్తినూతలపాడు, ఒంగోలు నగరం, త్రోవగుంట, కొప్పోలు, గుడిమెళ్ళపాడు, కొ త్తమామిడిపాలెం, పెళ్ళూరు, వెంగముక్కలపాలెం, చెరువుకొమ్ముపాలెం, అన్న వరప్పాడు, నరసాపురం అగ్రహారం, ప్రాంతాలలో ఎటువంటి అనుమతులు లేని లేఅవుట్లను గుర్తించినట్లు పేర్కొన్నారు. అనధికారకంగా వేసిన ప్లాట్ల లేఅవుట్తో కూడిన జాబితా (377)ను ప్రకాశం జిల్లా వెబ్సైట్లో పొందుపరిచామని, ఈ లేఅవుట్లలో స్థలము/ప్లాట్లు కొనుగోలు చేయడం చట్ట విరుద్దమని, వీటికి రిజిస్ట్రేషన్, ఎటువంటి భవన నిర్మాణ అనుమతులు మంజూరు ఉండదని తెలిపారు. రోడ్లు, విద్యుత్, నీరు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు కల్పించబడవని అధికారు లు స్పష్టం చేశారు. స్థిరాస్తులు కొనుగోలు చేసేటపుడు మోసపోకుండా వెబ్సైట్ లో పొందుపరిచిన వివరాలను పరిశీలించుకోవాలని ప్రజలకు సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa