భారత ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. వచ్చేనెల (సెప్టెంబర్) 6వ తేదీన ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తమ్మిన పట్నంలో పర్యటించనున్నారు. కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ సిటీ నిర్మాణం చేయబోతున్నారు. ఈ సెజ్ సిటీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో కలిసి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ఈ మేరకు ప్రధాని మంత్రి కార్యాలయం నుంచి సమాచారం రావడంతో పర్యటన కోసం అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు.
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో పరిశ్రమలతో పాటూ ఇతర అవసరాల కోసం 20 వేల ఎకరాల భూమిని ఇప్పటికే సేకరించిన సంగతి తెలిసిందే. అయితే కృష్ణపట్నం ఇండస్ట్రియల్ సెజ్ కోసం 12 వేల 500 ఎకరాలను కేటాయించారు. ఎగుమతి ఆధారిత పరిశ్రమలను ఈ సెజ్ పరిధిలో ఏర్పాటు చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్. ఈ పరిశ్రమలకు అనుబంధంగా చిన్న పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు ఈ సెజ్ సిటీ కోసం సేకరించిన భూములలో మౌలిక సదుపాయాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తాయి.
కేంద్రం తీర ప్రాంతంలో సాగర మాల పథకం కింద రహదారి నిర్మాణాన్ని ఇప్పటికే చేపట్టిన సంగతి తెలిసిందే.. ఈ పనులు కూడా ఊపందుకుంటున్నాయి. ఈ సాగర మాలకు కృష్ణపట్నం పోర్టు సమీపంలో ఉండడంతో ఎగుమతులు, దిగుమతులకు సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ సెజ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెజ్ ఏర్పాటు చేస్తే.. వేలాది మంది స్థానికులతో పాటూ యువత ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. ఈ సెజ్ ఏర్పాటుపై స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యారు. మళ్లీ ఇప్పుడు ఏపీకి రాబోతున్నారు. ప్రధాని మోదీ చాలా రోజుల తర్వాత ఏపీకి రాబోతుండటంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నెల్లూరు జిల్లా అధికారులు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa