వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. బెంగళూరు నుంచి శనివారం ఉదయం కడప ఎయిర్పోర్టుకు చేరుకున్న జగన్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. వైసీపీ నేతలు ఎయిర్పోర్టులోనే ఘన స్వాగతం లభించింది. మొదట తన పర్యటనలో భాగంగా పెండ్లిమర్రి మండంలోని మాచునూరు గ్రామానికి చేరుకున్న వైఎస్ జగన్.. ఇటీవల మృతిచెందిన వైసీపీ మండల కన్వీనర్ మాచునూరు చంద్రారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. చంద్రారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జగన్.. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆ ఈ సందర్భంగా దారిపొడవునా జగన్కు జనం నీరాజనాలు పట్టారు. జగన్పై, ఆయన కాన్వాయ్పై పూల వర్షం కురిపించారు. ఈ పర్యటనలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న వైఎస్ జగన్.. ఇవాళ, రేపు క్యాంప్ ఆఫీస్లో ప్రజలకు, పార్టీ నేతలకు అందుబాటులో ఉండనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa