భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అవుతోంది. మరీ ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వానలు బీభత్సం సృష్టి్స్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో వరదలు ఉప్పొంగి జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోగా.. తాజాగా మరోసారి వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కు హెచ్చరికలు చేసింది. వాయుగండం ముప్పు తొలిగిపోయిందని సంతోషపడే లోపే బంగాళాఖాతంలో త్వరలోనే ఏర్పడే అల్పపీడం క్రమంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తాజాగా హెచ్చరించారు. దీంతో మరోసారి ఏపీవాసులు వర్ష భయంతో బిక్కుబిక్కుమంటూ గడుతుపుతున్నారు. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
వాయుగుండం ముప్పు తొలిగిపోయే లోపే ఏపీ ప్రజలకు మరో అల్పపీడనం ముప్పు ముందు ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈనెల 5వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని.. అది క్రమేపీ బలపడనున్నట్లు తాజాగా పేర్కొన్నారు. ఈ అల్పపీడనం బలపడటానికి అనుకూలంగా రుతుపవన ద్రోణులు ఉన్నాయని తెలిపార. ఈ నేపథ్యంలోనే ఈ అల్పపీడన ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో కృష్ణా, గుంటూరు జిల్లాలకు మరోసారి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాలకు.. ఏపీ వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 24 గంటల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీంతో ఆయా ప్రాంతాల్లో వరద ముంపు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, ఏలూరు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయ్యింది.
ఇక ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వాగులు, వంకలు, చెరువులు, నదులు పొంగిపొర్లుతున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ వరద ముంపులో చిక్కుకోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏపీలో మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa