అకాల వర్షాల వల్ల మళ్ళీ బుడమేరుకు వరద ప్రవాహం పెరిగిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి, బుధవారం తెల్లవారుజామున మైలవరం, ఎగువ ప్రాంతమైన ఖమ్మం ఏరియాలో వర్షాలు పడటం వల్ల బుడమేరుకు 10 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. కొండపల్లి శాంతినగర్ ఎర్రబడ్జి వద్ద ఉన్న చెరువు కట్ట కూడా తెగిందన్నారు. దయచేసి చెరువుల గండ్లను తక్షణమే పూడ్చాలని విజ్ఞప్తి చేశారు. అలానే బుడమేరు పరివాహక ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తను గొల్లపూడి మార్కెట్ యార్డులో ఉన్నానని, జక్కంపూడి కాలనీలోని వరద బాధితులకు ఆహారాన్ని పంపించే పనిలో నిమగ్నమై ఉన్నానన్నారు. అత్యవసరమైతే తనకు ఫోన్ చేయాలని వసంత కృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa