తమ కుమారుడైన డాక్టర్ అభిషేక్ రెడ్డి అనారోగ్యాన్ని ఆసరాగా చేసుకుని టీడీపీ చేస్తున్న ప్రచారంపై వైయస్.అభిషేక్రెడ్డి తండ్రి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొండూరు మండల ఇన్ఛార్జి వైయస్.మదన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీడీపీ, ఆ పార్టీ నాయకులు అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తోందిని ధ్వజమెత్తారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్.జగన్ మోహన్రెడ్డి వ్యక్తిత్వాన్ని హననం చేయడమే టీడీపీ ఒక అజెండాగా పెట్టుకుందని, దీనికోసం అత్యంత నీచాతినీచమైన ప్రచారాలు చేస్తోందన్నారు. టీడీపీలో విలువలు, నైతికత అనేవి ఎక్కడా కనిపించడంలేదన్నారు. అభిషేక్ రెడ్డి తీవ్ర జ్వరం, ఇతర సమస్యలతో బాధపుడుతున్నారని, ప్రస్తుతం క్రమంగా కోలుకుంటున్నారని వైయస్.మధు వెల్లడించారు. అభిషేక్కు అందుతున్న వైద్యంపై వైయస్ జగన్ ఎప్పటికప్పుడు డాక్టర్లతో మాట్లాడుతున్నారన్నారు. ఆస్పత్రిలో చేరిననాటినుంచి ఇప్పటివరకూ పలుమార్లు ఆయన డాక్టర్లతోనూ, తమతోనూ మాట్లాడరన్నారు. తప్పుడు ప్రచారాలు మానాలని విజ్ఞప్తి చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa