ఇచ్ఛాపురం నుంచి ఒడిశా వైపు అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం మూటలను సీఎస్డీటీ సిబ్బందితో కలిసి దాడి చేసి పట్టుకున్నట్టు తహసీల్దార్ వెంకటరావు తెలిపారు. రెవెన్యూ, పౌరసర ఫరాల అధికారులు గురువారం వేకువ జా మున స్థానిక రైల్వే స్టేషన్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రైల్వే ప్లాట్ ఫా రంపై ఒడిశా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 14క్వింటాల పీడీఎఫ్ పట్టుకున్నా రు. బియ్యాన్ని తరలిస్తున్న ఉప్పలవీధికి చెందిన గేదెల ధనలక్ష్మితోపాటు మరో ఆరుగురుపై 6ఏ కేసు నమోదు చేసినట్టు సీఎస్డీటీ సంతోష్కుమార్ తెలిపారు. పట్టుకున్న బియ్యం మూటలను ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించామని తెలిపారు. ఈ దాడుల్లో పౌరసరఫరాల అధికారి సంతోష్కుమార్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa