ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి భూసేకరణ పనులు త్వరగా చేపట్టాలని అనంతపురం కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదే శించారు. కలెక్టరేట్లో సోమవారం భూసేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ... జిల్లాలో ఎనహెచ 544డీ, ఏపీట్రాన్సకో, ఏపీజెన్కో, కమలపాడు పీఎస్పీ, పవర్గ్రిడ్ కార్పొరేషన, రైల్వే పరిధిలోని తుమకూరు- రాయదుర్గం కొత్త బిజీ లైన, ఏపీఐఐసీ, హెచ ఎనఎస్ఎస్ ప్రాజెక్టుల పనులకు సంబంధించి భూసేకరణ వేగంగా చేపట్టా లన్నారు. జాతీయ రహదారుల పనుల్లో ఎక్కడా నిర్లక్ష్యం వహించవద్దన్నారు.
వచ్చేవారంలో ఆయా పనులలో పురోగతి కనిపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో జేసీ శివనారాయణశర్మ, డీఆర్ఓ రామక్రిష్ణారెడ్డి, ఎనహెచ ఏఐ పీడీ తరుణ్కుమార్, మేనేజరు మురళి, ఆర్అండ్బీ ఈఈ, సుదాకర రెడ్డి, ఏఈఈ రాఘవేంద్రరావుతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa