ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పీఎఫ్ విత్‌డ్రా కొత్త రూల్స్.. వారికి ఆధార్ నిబంధనల సడలింపు.. ఈజీగానే క్లెయిమ్ సెటిల్మెంట్

business |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 09:10 PM

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన చేసింది. ఇది పీఎఫ్‌ విత్‌డ్రాకు సంబంధించినది. సాధారణంగా పీఎఫ్ అకౌంట్ నుంచి.. డబ్బుల్ని విత్‌డ్రా చేసుకోవాలంటే.. కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. కేవైసీ అప్డేట్, యూఏఎన్ యాక్టివేషన్, క్యాన్సిల్డ్ చెక్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, యూఏఎన్- ఆధార్ సీడింగ్ ఇలా కొన్ని తప్పనిసరి. ఇంకొన్ని డాక్యుమెంట్లు కూడా అవసరం పడతాయి. విత్‌డ్రా సమయంలో అవసరమైనవి, అడిగినవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఇందులో ముఖ్యంగా పీఎఫ్ అకౌంట్ యూఏఎన్ నంబర్‌కు.. ఆధార్ కార్డును తప్పనిసరిగా లింక్ చేయాల్సి ఉంటుంది. దీనిని యూఏఎన్- ఆధార్ సీడింగ్ అంటారు.


దాదాపుగా ఆధార్ సీడింగ్ లేకుంటే.. పీఎఫ్ క్లెయిమ్స్ సెటిల్మెంట్ కావు. ఎక్కువగా తిరస్కరణకు గురవుతుంటాయి. ఇప్పుడు వీటికి సంబంధించి.. ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ జారీ చేసింది. కొన్ని వర్గాల ఉద్యోగులు లేదా కార్మికులు వంటి వారికి.. ఈ నిబంధన నుంచి మినహాయింపు కల్పిస్తున్నట్లు వెల్లడించింది. వారు ఆధార్ కార్డుకు బదులుగా అంటే ప్రత్యామ్నాయంగా ఇతర గుర్తింపు కార్డుల్ని ఫైనల్ సెటిల్మెంట్ ప్రాసెసింగ్ సమయంలో ఇస్తే సరిపోతుందని తెలిపింది. వీటిని ధ్రువీకరణ కోసం పరిగణనలోకి తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. దీనికి సంబంధించి.. నవంబర్ 29న సర్క్యులర్ విడుదల చేసింది.


>> భారత్‌లో ఆధార్ కార్డు పొందకుండా విదేశాలకు వెళ్లిన భారతీయులు.


>> విదేశాలకు వెళ్లి అక్కడే శాశ్వతంగా స్థిరపడిన భారత సిబ్బంది, ఆధార్ లేకుండా పౌరసత్వం పొందినవారు. ఇంకా ఇండియాలో పని కోసం ఉన్న నేపాల్, భూటాన్ వాసులు ఆధార్ కార్డులు కలిగి ఉండరు కానీ ఈఫీఎఫ్&ఎంపీ చట్టం ప్రకారం.. వీరు పీఎఫ్ పరిధిలోకి వస్తారు. కాబట్టి.. వీరు ఆధార్ సీడింగ్ అవసరం లేకపోయినా.. ఇతర గుర్తింపు కార్డుల్ని చూపిస్తే సరిపోతుందని ఈపీఎఫ్ఓ తాజాగా స్పష్టం చేసింది.


పీఎఫ్ విత్‌డ్రా ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో చేసుకునే వీలుంటుంది. ఆన్‌లైన్ ద్వారా అయితే.. ఈపీఎఫ్ పోర్టల్‌లోకి వెళ్లి చేసుకోవచ్చు. యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి.. క్లెయిమ్ చేసుకోవచ్చు. అక్కడ అడిగిన వివరాలు సమర్పించొచ్చు. రిటైర్మెంట్ సమయంలో లేదా కొన్ని నెలల పాటు నిరుద్యోగిగా ఉన్న సమయంలో పూర్తి డబ్బులు తీసుకోవచ్చు లేదా మధ్యలో వివాహం, విద్య, ఇంటి రెనోవేషన్, వైద్య ఖర్చులు వంటి వాటి కోసం పాక్షికంగా డబ్బులు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. గరిష్టంగా రూ. లక్ష వరకు కూడా తీసుకోవచ్చు. ఒకప్పుడు 10 రోజులకుపైగా సమయం పట్టేది. ఇప్పుడు 3 రోజుల్లోనే సెటిల్ అవుతున్నట్లు ఈపీఎఫ్ఓ చెబుతోంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com