ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ వర్షాలలో చిత్తూరు జిల్లా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2024, 05:22 PM

చిత్తూరు జిల్లాపై ఫెంగల్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఫెంగల్ దెబ్బతో జనజీవనం అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలకు పలు రోడ్డు దెబ్బతిన్నాయి. ఇప్పటికే చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరి, టమాటా, అరటి, కూరగాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 1500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది.దాదాపు 1500 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. కల్లాల్లో వరి పంట తడిసి మొలకెత్తుతోన్న పరిస్థితి ఏర్పడింది. నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa