ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లి ప్రాణాలు తీసిన కూతురి ప్రేమ, దారుణం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2024, 05:23 PM

తాడిపత్రిలో  ఓ కూతురి ప్రేమ తల్లి ప్రాణాల మీదకు తీసుకొచ్చింది. పట్టణంలోని ఐశ్వర్య విలాస్‌లో నివసిస్తున్న శ్రీలక్ష్మీ తనను పోలీసులు మందలించేలా కూతురు చేసిందనే కారణంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తాడిపత్రిలోని నవరంగ్ టాకీస్ రోడ్‌లో శ్రీనివాసులు కిరాణా కొట్టు నిర్వహిస్తున్నాడు. వారికి ఒక కుమార్తె ఉంది. అయితే సమీపంలోనే ఓ దుకాణంలో పనిచేస్తున్న యువకుడిని శ్రీనివాసులు కూతురు శ్రీజ ప్రేమించింది. ఎప్పటిలాగే ప్రతీ తల్లిదండ్రుల చేసిన విధంగానే.. కూతురు ప్రేమ వ్యవహారం తెలిసి శ్రీజ తల్లిదండ్రులు కూడా తీవ్రంగా వ్యతిరేకించారు.తన ప్రేమను నిరాకరించారన్న కోపంతో శ్రీజ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.


తల్లిదండ్రులపై డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీజ ఫిర్యాదుపై ఇంటికి వెళ్లిన పోలీసులు.. తల్లీ కూతురుతో మాట్లాడారు. అయితే ఇంటికి పోలీసులు రావడంపై శ్రీనివాసులు భార్య శ్రీ లక్ష్మీ అంత ఈజీగా తీసుకోలేకపోయింది. కన్న కూతురే పోలీసులకు ఫిర్యాదు చేయడంపై తీవ్ర మనస్థాపానికి గురైంది. వెంటనే పురుగుల మందు తాగి శ్రీలక్ష్మీ ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలిసిన బంధువులు శ్రీనివాసులు ఇంటికి వచ్చారు. అయితే శ్రీలక్ష్మీ ఆత్మహత్యకు కారణం కూతురే అంటూ యువతిని బంధువులు మందలించారు. బంధువుల సూటిపోటి మాటలతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీజ ఇంటిపైకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గుర్తించిన బంధువులు శ్రీజను కిందకు దించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే శ్రీజ పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో శ్రీజకు చికిత్స కొనసాగుతోంది. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa