కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ (కుడా) తుమ్మల బాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. పరిమితికి మించి జనం వేదిక మీదకు చేరుకోవటంతో స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో స్టేజ్ మీద ఉన్న నేతలు అందరూ కిందకి పడిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, పంతం నానాజీతో పాటుగా జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్ వేదిక మీద ఉన్నారు. అయితే కార్యకర్తలు, నేతలు ఎక్కువ మంది వేదిక మీదకు రావటంతో స్టేజ్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో నేతలు అందరూ కిందపడిపోయారు.
అయితే ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాటు చేసిన వేదిక ఎత్తులో లేకపోవటంతో ప్రమాదం తప్పింది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఈ ఘటనతో అక్కడున్నవారంతా భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన అనంతరం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగించారు. అయితే కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్గా తుమ్మల బాబు ప్రమాణ స్వీకారానికి కూటమికి చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు. దీంతో వారికి గజమాల వేసేందుకు అభిమానులు, కార్యకర్తలు ప్రయత్నించినట్లు తెలిసింది. ఇందుకోసం వేదిక మీదకు ఎక్కువమంది చేరుకోవటంతోనే ఒక్కసారిగా వేదిక కుప్పకూలినట్లు సమాచారం.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండల పులిమేరుకు చెందిన తుమ్మల రామస్వామి (బాబు)ను కుడా ఛైర్మన్గా కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. నామినేటెడ్ పదవుల రెండో జాబితాలో కుడా ఛైర్మన్గా తుమ్మల బాబుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అవకాశం కల్పించారు. కాకినాడ జిల్లా జనసేన అధ్యక్షుడిగా, జనసేన పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జ్గా తుమ్మల బాబు వ్యవహరిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ ఉన్న సమయంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా యువరాజ్యం అధ్యక్షుడిగా కూడా తుమ్మల బాబు పనిచేశారు. గత ఎన్నికల సమయంలో తుమ్మల బాబుకు జనసేన పార్టీ నుంచి పెద్దాపురం టికెట్ వస్తుందని ఊహించారు. కానీ పొత్తుల్లో సీటు టీడీపీకి పోవటంతో చినరాజప్ప పోటీ చేసి గెలుపొందారు. కూటమి విజయానికి కృషి చేయటంతో తుమ్మల బాబును కుడా ఛైర్మన్గా నియమించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa