ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ నేతలతో వైసీపీ నేత.. వివరణ కోరిన లోకేష్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 16, 2024, 04:28 PM

వైసీపీ కీలక నేత జోగి రమేష్, టీడీపీ నేతలతో ఓ కార్యక్రమంలో పాల్గొనడం చర్చనీయాంశమైంది. ఏలూరు జిల్లా నూజివీడులో ఆదివారం జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో వైసీపీ నేత జోగి రమేష్ పాల్గొనడంపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
మంత్రి పార్థసారధి, ఎమ్మెల్యే గౌతు శిరీష, కొనకళ్ల నారాయణ సహా పలువురు పాల్గొన్న ఈ కార్యక్రమానికి జోగి రమేష్ కూడా హాజరయ్యారు. ఆయన ఎందుకు వచ్చారు? ఎవరు ఆహ్వానించారనే విషయాలపై లోకేష్ టీడీపీ నేతలను వివరణ కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa