ఏడు పదుల వయసులోనూ 36 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ను ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు ఒప్పించడానికి పంజాబ్ సర్కారుకు సుప్రీం కోర్టు ఇటీవలే మూడు రోజుల సమయం ఇచ్చింది. అయితే ఈ మూడ్రోజుల్లో ఆయనకు వైద్య చికిత్స అందించలేకపోయిన ప్రభుత్వం మరింత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈక్రమంలోనే ధర్మాసనం మరో రెండు రోజుల సమయం ఇచ్చింది. అయితే ఈ రెండ్రోజుల్లో పంజాబ్ ప్రభుత్వం.. దల్లేవాల్ చేత ఆమరణ నిరాహార దీక్ష విరమింపజేయించడానికి ఏం చేస్తుందో చూడాలి.
70 ఏళ్లకు పైబడిన రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ నవంబర్ 26వ తేదీ నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ముఖ్యంగా పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ పంజాబ్ - హర్యానా సరిహద్దులోని ఖనౌరీ శిబిరం దీక్షను కొనసాగిస్తున్నారు. ఈయనకు మద్దతుగా అనేక మంది రైతులు, రైతు సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. వీరిని అడ్డుకోవడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేస్తున్నా అవేవీ ఫలించడం లేదు.
అయితే ఇటీవలే ఇటీవలే ఓ వ్యక్తి.. దల్లేవాల్కు వైద్య సాయం అందిచాలన్న ఆదేశాలను పంజాబ్ సర్కారు పాటించడం లేదంటూ వ్యాజ్యం దాఖలు చేయగా సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. డిసెంబర్ 28వ తేదీ రోజున రైతు సంఘాల నాయకులతో పాటు పంజాబ్ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమంలోనే దల్లేవాల్ను ఆస్పత్రికి తరలించేందుకు ప్రభుత్వానికి 3 రోజుల సమయం ఇచ్చింది. దల్లేవాల్ మంచి కోరుకునే రైతు సంఘాల నాయకులు ఎవరూ దాన్ని అడ్డుకోవద్దని చెప్పింది.
కానీ రైతులు, రైతు సంఘాల నాయకులు మాత్రం తమ నిరసనను మరింత తీవ్రతరం చేశారు. ఈక్రమంలోనే డిసెంబర్ 30వ తేదీ రోజు పంజాబ్ బంద్ పాటించారు. అలాగే 4వ తేదీన కూడా పెద్ద ఎత్తున "కిసాన్ మహా పంచాయత్" నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. మరోవైపు పంజాబ్ సర్కారు ఈరోజు సుప్రీం కోర్టు విచారణకు మరోసారి హాజరు అయింది. ఈ సందర్భంగా మాట్లాడుతూనే.. దల్లేవాల్కు వైద్యం అందించేందుకు వెళ్తే రైతు సంఘాలు అడ్డుకుంటున్నాయని.. కనీసం ఐవీ ఫ్లూయిడ్స్ కూడా ఇచ్చేందుకు వీలు దొరకట్లేదని చెప్పింది.
బలవంతంగా రైతు నాయకుడిని ఆస్పత్రికి తరలిస్తే ఇరువైపులా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పుకొచ్చింది. ఈక్రమంలోనే దల్లేవాల్ను ఆస్పత్రికి తీసుకు వెళ్లేందుకు తమకు మరింత సమయం కావాలని కోరింది. వారి అభ్యర్థనను అర్థం చేసుకున్ న్యాయస్థానం రెండు రోజుల సమయం ఇచ్చింది. మరి ఈ రెండు రోజుల్లోనైనా పంజాబ్ ప్రభుత్వం రైతు నాయకుల ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేయగల్గుతుందా లేదో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa