దేశవ్యాప్తంగా సీబీఐ అధికారుల విచారణకు సంబంధించి సుప్రీంకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏదైనా రాష్ట్రంలో సీబీఐ అధికారులు ఏదైనా కేసుపై దర్యాప్తు జరపాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి తీసుకోవాల్సి ఉండేది. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐని కేంద్ర ప్రభుత్వం తమ రాజకీయ కక్షకు వాడుకుంటోందని ఆరోపిస్తున్న ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు.. తమ అనుమతి లేకుండా తమ రాష్ట్రాల్లో సీబీఐ విచారణ చేపట్టడం కుదరదని తీర్మానాలు చేశాయి. అయితే తాజాగా ఈ వ్యవహారంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు తెలంగాణ సహా దేశంలోని 10 రాష్ట్రాలకు షాక్ ఇచ్చేలా నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి సీబీఐ విచారణకు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
తెలంగాణ, జార్ఖండ్, పంజాబ్, కేరళ, మిజోరం, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మేఘాలయ, తమిళనాడు రాష్ట్రాల్లో ఇప్పటివరకు సీబీఐ అధికారులు కేసులు నమోదు చేయాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ రాష్ట్రాల్లో సీబీఐ కేసు విచారణలు జరిపేందుకు ఆ రాష్ట్రాల జనరల్ కన్సంట్ అవసరం లేదని స్పష్టం చేసింది. తాజాగా ఓ అవినీతి కేసులో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ దర్యాప్తును రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ రాజేష్ బిందాల్లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం జనవరి 2వ తేదీన కొట్టివేసింది.
పోస్టింగ్ స్థలంతో సంబంధం లేకుండా.. వారిపై వాస్తవ పరిస్థితులను బట్టి వారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అయినా.. కేంద్ర ప్రభుత్వ అండర్టేకింగ్ సంస్థల ఉద్యోగులు అని.. అలాగే అవినీతి నిరోధక చట్టం ప్రకారం తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారని బెంచ్ అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ ఎఫ్ఐఆర్లు నమోదు చేయడంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో చర్చకు వచ్చింది.
అయితే ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడాన్ని గతంలో ఏపీ హైకోర్టు రద్దు చేసింది. దీనిని సీబీఐ అధికారులు.. సుప్రీంకోర్టులో సవాల్ చేయగా.. విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. రాష్ట్రాల పరిధిలో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వాల అనుమతి అవసరం లేదని తేల్చి చెప్పింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇక నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై సీబీఐ విచారణ కొనసాగించేందుకు రాష్ట్రాల సమ్మతి అవసరం లేదని స్పష్టం చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa