బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్పై గురువారం రోజు ఉదయం ఓ ఆగంతకుడు దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసు గురించి అనేక మంది స్పందించారు. ముఖ్యంగా ఘటన సమయంలో అక్కడే ఉన్న పని మనుషుల నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్, లీలావతి ఆసుపత్రి వైద్యులు అందరూ మాట్లాడారు. కానీ సైఫ్పై దాడి జరుగుతున్నప్పుడు అక్కడే ఉన్న ఆయన భార్య కరీనా కపూర్ మాత్రం స్పందించలేదు. తాజాగా ఈమె పోలీసులకు తన వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సైఫ్ అతడిని కాపాడబోయే దాడికి గురైనట్లు చెప్పింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ముంబయి పోలీసులకు కరీనా కపూర్ ఇచ్చిన వాంగ్మూలంలో.. నిందితుడు చాలా దూకుడుగా వ్యవహరించాడని తెలిపింది. ఎవరికీ తెలియకుండా ఇంట్లోకి ప్రవేశించిన నిందితుడు ముందుగా తమ చిన్న కుమారుడు జహంగీర్ (జెహ్) గదిలోకి ప్రవేశించాడని.. ఆ విషయం గుర్తించిన పని మనిషి కేకలు వేయగా ఆ విషయం తమకు తెలిసినట్లు వెల్లడించింది. పని మనుషులతో సహా తనను రక్షించేందుకు సైఫ్ ఈ విషయంలో జోక్యం చేసుకున్నాడని కరీనా కపూర్ వివరించింది.
ముఖ్యంగా నిందితుడు ఆ సమయంలో తన చిన్న కుమారుడు జహంగీర్ వద్దకు రాకుండా అడ్డుకునే క్రమంలోనే ఆరు కత్తి పోట్లకు గురయ్యాడని స్పష్టం చేసింది. నిందితుడు సైఫ్ను పదే పదే పొడుస్తుంటే కన్నీళ్లు ఆగలేవని వెల్లడించింది. నిందితుడు పారిపోయిన వెంటనే సైఫ్ను ఆస్పత్రికి తరలించేందుకు తాము ప్రయత్నించినట్లు పేర్కొంది. దాడి తర్వాత పారిపోయిన నిందితుడు ఇంట్లోంచి ఎలాంటి విలువైన వస్తువులను దోచుకెళ్లలేదని కూడా కరీనా తెలిపింది.
అయితే ఈ ఘటనపై అనేక మంది వాంగ్మూలం తీసుకుంటున్న పోలీసులు... ఇంకా సైఫ్ అలీఖాన్ నుంచి వాంగ్మూలం తీసుకోలేదు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత మెరుగయ్యాకే ఆయనను కలిసి వాంగ్మూలం తీసుకుంటామని చెబుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న సైఫ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని లీలావతి ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. ఇన్ఫెక్షన్ సోకుకుండా ఉండేందుకే ఆయన వద్దకు ఎవరినీ ఎక్కువగా అనుమతించడం లేదని కూడా స్పష్టం చేశారు. మరికొద్ది రోజుల్లోనే సైఫ్ డిశ్ఛార్జీ అవుతారని కూడా చెప్పుకొచ్చారు.
మరోవైపు ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడి ఇంకా వెతుకుతూనే ఉన్నారు. సీసీటీవీ కెమెరాల్లో చూసిన వ్యక్తి అసలు నిందితుడు కాదని.. సైఫ్ ఇంటి వద్ద అసలు నిఘా కెమెరాలే లేవని గుర్తించినట్లు వెల్లడించారు. కేసును దర్యాప్తు చేస్తున్నామని.. నిందితుడిని పట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa