జాతీయ మార్కెట్ ఆధారంగా గిరిజన సహకార సంస్థ (జీసీసీ) కాఫీ గింజల కొనుగోలు ధరలు పెంచినట్టు చింతపల్లి డివిజనల్ మేనేజర్ పి.దేవరాజు చెప్పారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ, కాఫీ పార్చిమెంట్ కిలో రూ.350, చెర్రీ రూ.200, రొబస్ట్రా రూ.130 ధరలుగా నిర్ణయించినట్టు చెప్పారు. ఈ ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఇప్పటికే జీసీసీకి కాఫీ గింజలు విక్రయించిన రైతులకు పెంచిన ధరల సొమ్మును రెండు రోజుల్లో వ్యక్తిగత బ్యాంకు ఖాతాలో జమచేస్తామన్నారు. కాఫీ గింజలను జీసీసీ ద్వారా మార్కెటింగ్ చేసుకుంటే అధిక ధర పొందే అవకాశం వుందన్నారు. జీసీసీ కాఫీ మార్కెటింగ్ సమాచారం కోసం రైతులు 8639393525, 7013070990 నంబర్లకు ఫోన్చేసి సంప్రదించాలని ఆయన కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa