అరకు వెళ్లే వారికి సూపర్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలంలో మంచు దుప్పటి కప్పుకున్న ప్రకృతి అందాలను చూడ్డానికి తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా పొరుగున ఉన్న రాష్ట్రాల నుంచి కూడా అరకు లోయకు సందర్శకులు తరలివస్తుంటారు. శీతాకాలంలో అరకు లోయ అందాలను చూసి మైమరిచిపోతుంటారు. అలాంటి సందర్శకుల ఆనందాన్ని రెట్టింపు చేసేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదేళ్ల తర్వాత మళ్లీ అరకు ఉత్సవ్ నిర్వహిస్తోంది. అరకు ఉత్సవ్ 2025 పేరిట ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.జనవరి 31 నుంచి మూడు రోజుల పాటు అరకు ఉత్సవ్ నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. తాజాగా అరకు ఉత్సవ్ నిర్వహణకు కోటి రూపాయలు కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అరకు చలి పండుగకు కోటి రూపాయలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అరకు ఉత్సవ్తో పాటుగా ఫ్లెమింగ్ ఫెస్టివల్కు కూడా కోటి రూపాయలు మంజూరు చేశారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకూ అరకు చలి పండుగ జరుగుతుంది. అరకు ఉత్సవ్ కోసం అధికారులు ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే అల్లూరి జిల్లా కలెక్టర్ ప్లాస్టిక్ వాడకంపై నిషేధం విధించారు. అరకు ఉత్సవ్ చూడటానికి పర్యాటకులు పెద్దఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa