కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని గ్రామీణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు అని కూటమి నేతలు వాపోతున్నారు. వారు మాట్లాడుతూ.... సీసీ రోడ్లు, తారురోడ్లు, తాగునీటి సౌకర్య తదితర అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో అభివృద్ధి పూర్తిగా కుటుంటపడింది. డ్రైనేజీ లేకపోవడంతో వీధుల్లో మురుగునీరు ప్రవహించేదని, రోడ్లు సరిగా లేకపోవడంతో ఇబ్బందులు పడ్డామని ప లు గ్రామాల ప్రజలు అంటున్నారు. ఇప్పుడు రోడ్ల నిర్మాణంతో ప్రశాంతంగా ఉందని హర్షం వ ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు మండలపరిధిలోని పలు గ్రామాల్లో రూ. 3కోట్లతో సిమెంటు రోడ్లు వేశారు. దీంతో పాటు తలుపూరు గ్రామానికి రూ. కోటితో తారురోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి.
అలాగే గొరిదిండ్ల, తోపుదుర్తి గ్రామాల్లో రెండు విద్యుత సబ్స్టేషన్ల పనులు జరుగుతున్నాయి. ఆత్మకూరు మేజర్ పంచాయతీలో ముందస్తుగా తాగునీటి సమస్య తలేత్తకుండా రూ. 30లక్షలతో రెండు బోర్లు వేసి, ఇంటింటా నీటి సరఫరాకు పైప్లైన చేశారు. గ్రామాల్లో మరిన్ని అభివృద్ది పనులకు ప్రతిపాదనలు పంపారు. గత ఐదేళ్లలో వైసీసీ ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని కూట మి ప్రభుత్వం ఏర్పడ్డాక ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో ఆర్నెల్లలోనే జరుగుతున్నాయిని గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.