మధ్య ప్రదేశ్ రాజ్గఢ్ పట్టణానికి చెందిన ఓ మహిళకు జనవరి 11వ తేదీన ఆడపిల్ల పుట్టింది. కానీ దాన్ని ఏమాత్రం జీర్ణించుకోలేకపోయిన ఆమె.. తన తల్లి సాయంతో చిన్నారిని వదిలించుకోవాలనుకుంది. ఈక్రమంలోనే బుజ్జాయి అమ్మమ్మ.. చిన్నారి గొంతు కోసింది. తీవ్ర రక్తస్రావం కాగా చనిపోయిందని భావించారు. ఆపై ఎవరూ చూడకుండా ఓ బట్టలో చుట్టి చెత్తకుండీలో పడేశారు. ఆపై అక్కడి నుంచి ఏమీ తెలియనట్లుగా ఇంటికి వెళ్లిపోయారు. కానీ కాసేపటి తర్వాత చిన్నారి ఏడవడం ప్రారంభించింది.
బుజ్జాయి ఏడుపు విన్న స్థానికులు అక్కడకు వెళ్లి చూడగా.. తీవ్ర గాయాలతో కనిపించింది. ఒళ్లంతా రక్తంతో తడిసిపోయి ఉండగా భయపడి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసుల.. ముందుగా చిన్నారిని భోపాల్లోని కమలా నెహ్రూ ఆస్పత్రికి తరలించారు. ఆపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. ఆక్రమంలోనే చిన్నారి తల్లి, అమ్మమ్మలను అరెస్ట్ చేశారు. ఇదంతా ఇలా ఉండగా.. ఆస్పత్రిలో ఉన్న బుజ్జాయికి వైద్యులు మెరుగైన చికిత్స అందించారు.
అందాల బొమ్మలా ఉన్న ఆ నవజాత శిశువుకు పిహు అని పేరు పెట్టి మరీ.. నెల రోజుల పాటు చికిత్స చేశారు. 24 గంటలూ అబ్జర్వేషన్లో పెట్టి అవసరమైన అన్ని శస్త్ర చికిత్సలు చేశారు. ఇలా వైద్యులు నెల రోజు కష్టానికి ప్రతిఫలంగా చిన్నారి బతికింది. ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా మారిపోగా పిహును రాజ్గఢ్లోని ఓ సంక్షేమ కేంద్రానికి తరలించారు.
ఈ విషయాన్ని నేరుగా ఆస్పత్రి హెచ్ఓడీ డాక్టర్ ధీరేంద్ర శ్రీవాత్సవ్ తెలిపారు. చిన్నారి సిరలు, ధమనులకు ఎలాంటి గాయాలు కాకపోవడం వల్లే బుజ్జాయి బతికిందని.. ఆ పాప అంటే ఆస్పత్రిలో ఉన్న వైద్యులు అందరికీ ఇష్టమేనని చెప్పారు. ఎంతో ఇష్టంగా పిహు అనే పేరు పెట్టుకుని చక్కగా చూసుకున్నామని కూడా స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa