ప్రతి రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి ఏకంగా ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతోంది. చివరగా 2017లో జరిగిన ఛాంపియన్స్ని ట్రోఫీ మళ్లీ 2025లో నిర్వహిస్తున్నారు. ఒకవేళ గ్యాప్ వస్తే మూడేళ్లు, లేదంటే నాలుగేళ్లు కానీ ఎనిమిదేళ్లు ఎందుకు వచ్చిందని మీరు ఆలోచించారు. రీజన్స్ ఏంటి అని మీకూ తెలుసుకోవాలని ఉందా? అయితే, ఈ వార్త చదివేయండి.
ప్రతి రెండేళ్లకు ఒకసారి జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి ఏకంగా ఎనిమిదేళ్ల తర్వాత జరుగుతోంది. చివరగా 2017లో జరిగిన ఛాంపియన్స్ని ట్రోఫీ మళ్లీ 2025లో నిర్వహిస్తున్నారు. ఒకవేళ గ్యాప్ వస్తే మూడేళ్లు, లేదంటే నాలుగేళ్లు కానీ ఎనిమిదేళ్లు ఎందుకు వచ్చిందని మీరు ఆలోచించారు. రీజన్స్ ఏంటి అని మీకూ తెలుసుకోవాలని ఉందా? అయితే, ఈ వార్త చదివేయండి.
వన్డే ఫార్మాట్లో ప్రపంచకప్ లాగానే మరో మెగా టోర్నీని నిర్వహించాలనే ఉద్దేశంతో ఛాంపియన్స్ ట్రోఫీకి శ్రీకారం చుట్టారు. వరల్డ్కప్లా అన్ని జట్లు పాల్గొనకుండా ప్రపంచ క్రికెట్లోని టాప్-8 టీమ్స్ మాత్రమే ఇందులో ఉండేలా కండీషన్ పెట్టారు. అంటే ప్రతీ మ్యాచ్ కూడా ఫైనల్లా జరగాలనేదే ఐసీసీ ఉద్దేశం.
క్రికెట్ అభిమానులకు మరింత ఎంటర్టైన్మెంట్ అందించేందుకు ఐసీసీకి 1998లో ఈ ఐడియా వచ్చింది. బంగ్లాదేశ్ వేదికగా తొలి ఎడిషన్కు శ్రీకారం చుట్టారు. ఫస్ట్ టైటిల్ను సౌతాఫ్రికా జట్టు గెలుచుకుంది. తొలుత ఐసీసీ నాకౌట్ ట్రోఫీ అని పిలిచేవాళ్లు. 2022లో దీన్ని ఛాంపియన్స్ ట్రోఫీగా నామకరణం చేశారు. ఆ ఏడాదే భారత్-శ్రీలంక జట్లు ఛాంపియన్స్ ట్రోఫీని పంచుకున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఇప్పటి వరకు ఎనిమిదిసార్లు జరగ్గా భారత్, ఆస్ట్రేలియా జట్లు అత్యధికంగా రెండ్రెండు సార్లు ట్రోఫీని అందుకున్నాయి. 2017లో చివరగా జరిగిన ట్రోఫీలో భారత్ను ఓడించి పాకిస్తాన్ ఛాంపియన్స్గా నిలిచింది.
2006 వరకు రెండేళ్లకు ఒకసారి జరిగిన ఈ టోర్నీ ఆ తర్వాత నుంచి మూడేళ్లకు ఒకసారి, ఆ తర్వాత నాలుగేళ్లకు నిర్వహించడం మొదలుపెట్టారు. 2017 తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీని ఆపేయాలంటూ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. వన్డే వరల్డ్కప్లో జట్లే పోటీ పడుతున్నాయి, పైగా అవే యాభై ఓవర్లు మ్యాచ్ అలాంటప్పుడు ఈ టోర్నీ ఎందుకని 2021లో కొందరు అడ్డంకి చెప్పడంతో ఛాంపియన్స్ టోర్నీని ఐసీసీ నిలిపేసింది.
టీ20 ఫీవర్ ఎక్కువైన ఈ తరుణంలో మళ్లీ వన్డే క్రికెట్లో జోష్ నింపేందుకు ఛాంపియన్స్ ట్రోఫీని తెరపైకి తీసుకొచ్చారు. పాకిస్తాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్నారు. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ టోర్నీలో రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్. గ్రూప్ బీలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అప్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి.
పాకిస్తాన్తో ద్వైపాక్షిక సంబంధాలు సరిగా లేని కారణంగా భారత్ ఆడే మ్యాచ్లకు మాత్రం దుబాయ్ వేదిక కానుంది. ఒకవేళ భారత్ సెమీ ఫైనల్స్, ఫైనల్స్కు చేరుకున్నా దుబాయ్లోనే ఆ మ్యాచ్లు జరుగుతాయి. ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుండగా.. భారత్ తన తొలి మ్యాచ్ ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్తో ఆడనుంది. హై ఓల్టేజ్ భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa