శ్రీలంక జట్టు వన్డేల్లో మళ్లీ పుంజుకుంటోంది. స్వదేశంలో ఆ జట్టును ఓడించాలంటేనే మిగతా జట్లు గడగడలాడిపోతున్నాయి. సంగార్కక, జయవర్దనే శకం ముగిసిన తర్వాత చాలా కాలం పాటు వరుస ఓటములతో సతమతమయింది. కానీ ఇప్పుడు బ్యాటింగ్, బౌలింగ్తో అదరగొడుతోంది. శ్రీలంక వేదికగా చివరగా జరిగిన నాలుగు వన్డే సిరీస్లలోనూ ఘన విజయాలు సాధించింది.
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది. ఆసీస్ ప్లేయర్లు కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. తొలి మ్యాచ్లో 49 పరుగుల తేడాతో గెలుపొందిన శ్రీలంక, రెండో వన్డేలో 174 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. స్పిన్కు అనుకూలించే ఉపఖండం పిచ్లలో శ్రీలంక స్పిన్నర్లు ముప్పుతిప్పలు పెట్టారు. యువ స్పిన్నర్ దునిత్ వెల్లాలగే ఆరు వికెట్లు తీసుకోగా, తీక్షణ నాలుగు, హసరంగ నాలుగు వికెట్లు పడగొట్టి సిరీస్ కైవసం చేసుకున్నారు.
మూడు క్లీన్ స్వీప్
సొంత గడ్డపై శ్రీలంక ఆడిన నాలుగు వన్డే సిరీస్లలో మూడింటిని క్లీన్ స్వీప్ చేసింది. భారత్తో 2-0, వెస్టిండీస్పై 2-1, న్యూజిలాండ్ 2-0, ఆసీస్పై 2-0తో సిరీస్లను సొంతం చేసుకుంది. అంతకుముందు అప్ఘనిస్తాన్ 3-0, జింబాబ్వేను 2-0తో చిత్తు చేసింది. చిన్న జట్లపైనే కాకుండా ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లను కూడా క్లీన్ స్వీప్ చేసి కమ్ బ్యాక్ సాధించామని మెసెజ్ ఇచ్చింది. చరిత అసలంక నాయకత్వంలో రానున్న ఐసీసీ వేదికలపై కూడా తమ జట్టు రాణిస్తుంది అనే భరోసా కల్పించింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో నో ప్లేస్పాకిస్తాన్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో శ్రీలంక జట్టు స్థానం సాధించలేకపోయింది. ఇప్పుడున్న పరిస్థితిలో శ్రీలంక జట్టు ఛాంపియన్స్ ట్రోఫీలో ఉండుంటే ఉపఖండం పిచ్లలో కచ్చితంగా రాణించి ఉండేది. స్పిన్కు అనుకూలించే పాకిస్తాన్ పిచ్లపై శ్రీలంక స్పిన్నర్లు సత్తా చాటుండేవారు. ఇప్పుడిప్పుడే కమ్ బ్యాక్ అవుతున్న శ్రీలంక రానున్న ఐసీసీ ట్రోఫీల్లో తమ మార్క్ కచ్చితంగా చూయిస్తుందని సీనియర్లు గట్టి నమ్మకంతో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa