మాజీ సీఎం జగన్ పోలీసులపై బెదిరింపు వ్యాఖ్యలు మానుకోవాలని ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు హితవు పలికారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయని, పోలీసు అధికారులు రిటైర్ అయిన తర్వాత కూడా వారిని తీసుకొచ్చి బట్టలూడదీసి నిలబెడతామని మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. జగన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్నారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు కేసు పెట్టి వంశీని అరెస్ట్ చేయించారని ఆరోపించారు. చంద్రబాబుతో కలిసి పోలీసులు దిగజారి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలీసులు టీడీపీ వారికి సెల్యూట్ చేస్తున్నారని ఆక్షేపించారు.పోలీసులు టోపీ మీద ఉన్న మూడు సింహాలకే సెల్యూట్ చేయాలని టీడీపీ నేతలకు కాదని జగన్ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వీరందరి సంగతి చూస్తామని హెచ్చరించారు. వంశీ అరెస్ట్ చేసే సమయంలో ఓ సీఐ చాలా దురుసుగా ప్రవర్తించినట్లు చెప్పారు. ఏడాదిలో రిటైరవుతున్నానంటూ ఆయన అలా వ్యవహరించారని అన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక ఆ సీఐ రిటైరైనా సరే అతని సంగతి తేలుస్తామని వ్యాఖ్యానించారు. పోలీసులు వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని జగన్ సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa