ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షపాతం లోపంతో కశ్మీర్‌కు ముప్పు

national |  Suryaa Desk  | Published : Wed, Feb 19, 2025, 03:29 PM

కశ్మీర్‌కు కరవు ముప్పు పొంచి ఉంది. ఈ ఏడాది ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొనడంతో జనవరి, ఫిబ్రవరి నెలల్లో 80 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ కారణంగా వేసవిలో స్థానికంగా కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. జనవరితో పాటు ఫిబ్రవరి నెలలో కలిపి ఇప్పటి వరకూ 79 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపింది. ఇలాగే పొడి వాతావరణం కొనసాగితే కశ్మీర్ లోయ వాసులకు తాగు నీటితో పాటు సాగు నీటికి ఇక్కట్లు తప్పవని వాతావరణ శాఖ పేర్కొంది.  అంతే కాకుండా, జీలం, ఇతర నదుల్లో సాధారణ నీటి మట్టంతో పోలిస్తే ఈ ఏడాది ఒక మీటరు తక్కువ స్థాయిలో ప్రవాహం ఉన్నట్లు స్థానిక నీటి పారుదల, వరదల నియంత్రణ విభాగ అధికారి ఒకరు తెలిపారు. మరో 15 రోజుల్లో వర్షం లేదా మంచు పడకపోతే పరిస్థితులు మరింత కష్టతరంగా మారే ప్రమాదం ఉందని వెల్లడించారు. ఇప్పటికే దక్షిణ కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో నీటి వనరులు పూర్తిగా ఎండిపోయాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మరోపక్క మంచు లేకపోవడంతో ఈ నెల 22 నుంచి ప్రారంభం కావాల్సిన ‘ఖేలో ఇండియా’ వింటర్ గేమ్స్‌ను వాయిదా వేశారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa