ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెమోరీ ఛాపింయన్‌షిప్ గెలుచుకున్న విశ్వ రాజకుమార్

national |  Suryaa Desk  | Published : Fri, Feb 21, 2025, 07:50 PM

20 ఏళ్ల వయసు కల్గిన ఓ భారతీ విద్యార్థి మెమోరీ లీగ్ ప్రపంచ ఛాపింయన్‌షిప్ విజేతగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం 13.50 సెకన్లలోనే 80 అంకెలను గుర్తుంచుకుని చెప్పగలిగాడు. ఇలా ఈ పోటీలో నెగ్గిన ఇతడి పేరే విశ్వ రాజకుమార్. ప్రస్తుతం కళాశాల విద్యను అభ్యసిస్తున్న ఇతడు.. ఈ ఛాపింయన్‌షిప్‌లో ఎలా గెలిచాడు, దీని కోసం అతడు ఎంతగా కృషి చేశాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.


పుదుచ్చేరిలోని మనకుల వినాయగర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీలో చదువుతున్నాడు. అయితే ఇతడికి చిన్నప్పటి నుంచే జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండేది. అది గుర్తించిన తల్లిదండ్రులు ఈయనకు శిక్షణ ఇప్పించారు. 2025 జనవరి నెలలో చనిపోయిన ప్రఖ్యాత నాడీ శాస్త్రవేత్త ఎలియనోర్ మాగ్వైర్‌యే రాజకుమార్ గురువు. ఆయనే దగ్గరుండి ఇతడికి ఎలా జ్ఞాపకం ఉంచుకోవాలో నేర్పించారు. ఈక్రమంలోనే ఆయన తాజాగా.. మెమోరీ లీగ్ ప్రపంచ ఛాపింయన్‌షిప్‌లో పాల్గొన్నాడు.


ఇందులో అనేక రౌండ్లు పెట్టగా.. వాటిల్లో ఒక్కొక్క దాంట్లో గెలుస్తూ వచ్చాడు. సంఖ్యలు, పదాలు, చిత్రాలను స్క్రీన్లపై చూపించగా.. వాటిని వల్లె వేయాలి. ఆపై 100 శాతం కచ్చితత్వంతో సరైన క్రమంలో చెప్పాల్సి ఉంటుంది. ఇలా రాజకుమార్ 8.40 సెకన్లలోనే 30 చిత్రాలను కంఠస్థం చేశాడు. ఇలా ప్రతీ రౌండ్‌లో అసాధారణ ప్రతిభ కనబరుస్తూ.. చివరి రౌండ్ వరకు 5000 పాయింట్లు సంపాదించాడు. అలా ఈ మెమోరీ లీగ్ ప్రపంచ ఛాపింయన్‌షిప్‌లో మొదటి విజేతగా నిలిచాడు.


విశ్వ రాజకుమార్ మెమోరీ ప్యాలెస్ టెక్నిక్‌ను ఉపయోగిస్తానని ఓ ఇంటర్వ్యూలో పాల్గొని చెప్పాడు. ఇది రోమన్ కాలం నాటి పురాతన పద్ధతి. ఈ టెక్నిక్‌లో సమాచార భాగాలను ఇంట్లోని గదుల వంటి నిర్దిష్ట ప్రదేశాలతో అనుసంధానం చేసి మానసికంగా వాటి గుండా నడుస్తూ సమాచారాన్ని వరుసగా గుర్తుకు తెచ్చుకుంటారు. దీని గురించి విశ్వ రాజకుమారే స్వయంగా చెప్పగా.. జ్ఞాపక శక్తి పని తీరులో హైడ్రేషన్ పాత్ర కూడా ఎక్కువగా ఉంటుందన్నారు.


అలాగే భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. భారత దేశంలో తానో జ్ఞాపక శక్తి శిక్షణ సంస్థను ప్రారంభించాలని అకుంటున్నట్లుగా చెప్పాడు. అధునాతన జ్ఞాపకశక్తి పద్ధతులను ఇతరులకు నేర్పించాలనుకుంటున్నట్లు వివరించాడు. చూడాలి మరి ఆయన కల ఎప్పుడు నెరవేరుతుందనేది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa