ట్రెండింగ్
Epaper    English    தமிழ்

49.4 ఓవర్లలో పాక్ ఆలౌట్.. భారత్ టార్గెట్ 242

sports |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2025, 10:16 PM

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు మోస్తరు స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్‌ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో అత్యధికంగా కుల్‌దీప్ యాదవ్ మూడు వికెట్లు తీశాడు. సౌద్ షకీల్ 62 రన్స్‌తో ఆ జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు.


ఫకర్ జమాన్ గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరం కావడంతో ఈ మ్యాచ్‌ తుది జట్టులో ఇమామ్‌ ఉల్ హక్‌కు చోటు దక్కింది. అయితే అందివచ్చిన అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 26 బంతుల్లో 10 రన్స్ చేసి రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. ఇక ఉన్నంత సేపులో క్రీజులో సౌకర్యవంతంగా కనిపించిన బాబర్ ఆజమ్.. 26 బంతుల్లో 23 రన్స్ చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. బాబర్‌ను ఔట్ చేసిన తర్వాత హార్దిక్ పాండ్యా అతడికి సెండాఫ్ ఇచ్చాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.


ఓపెనర్లు ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్‌తో కలిపి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. అయితే ఈ జోడీ ఆశించినంత వేగంగా పరుగులు చేయలేకపోయింది. దీంతో స్కోరు బోర్డు నిదానంగా కదిలింది. అయితే వేగంగా ఆడే క్రమంలో వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే ఔట్ అయ్యారు. తొలుత రిజ్వాన్ (77 బంతుల్లో 46 రన్స్‌) ఆ తర్వాత సౌద్ షకీల్ (76 బంతుల్లో 62 రన్స్‌) ఔట్ అయ్యారు. అప్పటికి జట్టు స్కోరు 159/4గా ఉంది.


  చివర్లో కుష్‌దిల్ షా 39 బంతుల్లో 38 రన్స్ చేసి.. జట్టుకు పోరాడే స్కోరును అందించాడు. జట్టు స్కోరు 241 వద్ద అతడు చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో మరో 2 బంతులు మిగిలి ఉండగానే పాకిస్థాన్ ఆలౌట్ అయింది. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ అత్యధికంగా 3 వికెట్లు తీశాడు. హార్దిక్ పాండ్యా 2 వికెట్లు పడగొట్టాడు. హర్షిత్ రాణా, అక్షర్ పటేల్‌, రవీంద్ర జడేజాలకు ఒక్కో వికెట్ దక్కింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa