ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు,,,లోన్ తీసుకునేవారికి ఆ ఛార్జీలు ఉండవిక

business |  Suryaa Desk  | Published : Sun, Feb 23, 2025, 11:11 PM

బ్యాంకుల్లో పర్సనల్ లోన్, హోమ్ లోన్, వెహికల్ లోన్ అంటూ వివిధ అవసరాల కోసం రుణాలు తీసుకుంటుంటారు. అలాంటి వారందరికీ ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరే శుభవార్త అందించింది. దాదాపు 5 సంవత్సరాల తర్వాత వడ్డీ రేట్లను తగ్గించింది. దీంతో లోన్ ఈఎంఐ భారం తగ్గిందని చెప్పవచ్చు. ఇప్పుడు మరో శుభవార్త తీసుకొచ్చింది రిజర్వ్ బ్యాంక్. లోన్ తీసుకునే వారిపై అదనపు భారం పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది. రుణాలు టెన్యూర్‌కి ముందే చెల్లిస్తే విధించే ఛార్జీలకు చెక్ పెట్టింది. ఎలాంటి ఛార్జీలు విధించొద్దని కీలక ప్రతిపాదన చేసింది.


బ్యాంకులు రుణాల ముందస్తు చెల్లింపులపై ప్రీ పేమెంట్ పెనాల్టీ లేదా ఫోర్స్ క్లోజర్ పేరుతో ఛార్జీలు వసూలు చేస్తుంటాయి. ఈ ఛార్జీల విధానాన్ని తొలగించే దిశగా రిజర్వ్ బ్యాంక్ ముఖ్య ప్రతిపాదన చేసింది. వ్యక్తులు, ఎంఎస్ఎంఈలు తీసుకునే ఫ్లోటింగ్ వడ్డీ రేటు రుణాలు, వ్యాపార అవసరాలకు తీసుకునే రుణాలపై ముందస్తు చెల్లింపులు చేస్తే ఎలాంటి ఛార్జీలు ఉండకూడదని ప్రతిపాదనలు చేసింది. ఈ ప్రతిపాదనలు అమలులోకి వచ్చినట్లయితే హోమ్ లోన్, పర్సనల్ లోన్, కారు లోన్లు తీసుకునే వారు వేగంగా లోన్ చెల్లించే అవకాశం లభించడంతో పాటు అదనపు ఛార్జీల నుంచి ఉపశమనం లభించనుంది.


'టైర్ 1, టైర్ 2 ప్రాథమిక ఆర్బన్ కోపరేటివ్ బ్యాంకులు, బేస్ లేయర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు మినహా ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోని అన్ని రకాల వాణిజ్య బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‍‌సీలు ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో ఇచ్చే రుణాలను ముందస్తుగా చెల్లిస్తే ఎలాంటి ఛార్జీలు లేదా పెనాల్టీలు విధించరాదు' అని రిజర్వ్ బ్యాంక్ తన ముసాయిదా సర్క్యులర్‌లో పేర్కొంది. ఎంఎస్ఎంఈ రుణ గ్రహీతలు అయితే రూ.7.50 కోట్ల వరకు పూర్తి రుణ మొత్తాలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. ఎలాంటి లాకిన్ పీరియడ్ లేకుండా అమలు చేయాలని కోరింది. ఈ ముసాయిదాపై మార్చి 21, 2025 లోపు సలహాలు, సూచనలు చేయాలని ఆర్‌బీఐ ఆహ్వానించింది.


అన్‌సెక్యూర్డ్ లోన్స్, డెరివేటివ్స్ ట్రేడింగ్ గణనీయంగా పెరుగుతుండడంపై ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎం.రాజేశ్వర రావు ఆందోళన వ్యక్తం చేశారు. తాత్కాలిక లాభాల ఆకర్షణ వల్ల దీర్ఘకాలిక భద్రతను కోల్పోతున్నారని పేర్కొన్నారు. అనాలోచితంగా ఆర్థిక సేవలను విస్తరిస్తే రిస్క్ తప్పదని హెచ్చరించారు. ఈ విషయంలో అప్రమత్తత అవసరమని ఆర్థిక సంస్థలను హెచ్చరించారు. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa