రెండు పెద్ద నగరాల మధ్య ఎక్స్ప్రెస్ వే నిర్మించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బెంగళూరు-మంగళూరు నగరాలను అనుసంధానిస్తూ తొందర్లోనే ఎక్స్ప్రెస్ను నిర్మిస్తామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. హసన్ ప్రాంతం మీదుగా ఈ రెండు నగరాలను కలుపుతూ ఈ కొత్త ఎక్స్ప్రెస్ వే నిర్మాణం ఉంటుందని స్పష్టం చేసింది. బెంగళూరు, మంగళూరు నగరాలను కలుపుతూ నిర్మించే ఈ ఎక్స్ప్రెస్ వే ద్వారా రెండు నగరాలకు మధ్య ప్రయాణ దూరం భారీగా తగ్గుతుందని తెలిపింది. ఈ ఎక్స్ప్రెస్ వే బెంగళూరు, మంగళూరు నగరాల ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందించడమే కాకుండా.. రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలకు కూడా ఊతం ఇస్తుందని కేంద్రం తేల్చి చెప్పింది.
ఈ కొత్త ఎక్స్ప్రెస్ వే నిర్మాణం పూర్తి అయితే బెంగళూరు, మంగళూరు నగరాల మధ్య ప్రయాణ సమయం 7 నుంచి 8 గంటల వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును భారత జాతీయ రహదారుల అథారిటీ (ఎన్హెచ్ఏఐ), కర్ణాటక ప్రజా పనుల శాఖలు కలిసి సంయుక్తంగా చేపట్టనున్నట్లు వెల్లడించింది. ఇక ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మించడానికి ప్రధాన బెంగళూరు వెలుపలి ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం అని కేంద్రం తెలిపింది.
బెంగళూరు-మంగళూరు మధ్య నిర్మించే ఈ ఎక్స్ప్రెస్ వే 335 కిలోమీటర్ల దూరం ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 4 నుంచి 6 లేన్లుగా ఈ ఎక్స్ప్రెస్ వే నిర్మాణం చేయనున్నారు. బెంగళూరు-మంగళూరు ఎక్స్ప్రెస్ వే నిర్మాణం 2028లో ప్రారంభం కానున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇది కర్ణాటక రాష్ట్ర రవాణా రంగానికి గేమ్ ఛేంజర్గా మారనుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బెంగళూరు, మంగళూరు నగరాల మధ్య ప్రయాణానికి చాలా సమయం పడుతోందని కర్ణాటక వాసులు చెబుతున్నారు.
మరీముఖ్యంగా వర్షాకాలంలో ఈ మార్గంలో ప్రయాణించాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాహనదారులు పేర్కొంటున్నారు. ఇటీవల కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ.. బెంగళూరు ట్రాఫిక్ రద్దీ సమస్యను రాబోయే 2, 3 ఏళ్లలో పరిష్కరించడం దాదాపుగా అసాధ్యమని వ్యాఖ్యానించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa