మాతృ భాషను ఎంతగానో గౌరవించి.. ఆ భాషలోనే విద్యార్థులకు చదువు చెప్పిస్తున్న తమిళనాడులో దారుణం జరిగింది. హిందీ పద్యం చెప్పమని అడిగితే.. మూడో తరగతి బాలుడు నోరు విప్పకపోవడంతో తీవ్ర కోపోద్రిక్తురాలైన ఉపాధ్యాయురాలు బాలుడిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టింది. ఆపై బడిలో అడుగు పెట్టనీయనంటూ బెదిరించింది. దీంతో భయపడిపోయిన ఆ విద్యార్థి కన్నీరుపెడుతూనే ఇళ్లు చేరాడు. ఆపై జరిగిందంతా తల్లిదండ్రులకు చెప్పాడు. కుమారుడి బాధ చూసి తట్టుకోలేకపోయిన ఆ కుటుంబ సభ్యులు వెంటనే బడికి వెళ్లి సదరు ఉపాధ్యాయురాలిపై ఫిర్యాదు చేశారు. ఆపై ఏం జరిగిందో తెలియాలంటే మీరీ కథ చదివేయాల్సిందే.
తమిళనాడు రాజధాని నగరం చెన్నై కిల్పాక్లోని భవన్ రాజాజీ విద్యాశ్రమ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఓ బాలుడిపై అక్కడి ఉపాధ్యాయురాలు ఇష్టానుసారంగా ప్రవర్తించింది. ముఖ్యంగా ఫిబ్రవరి 21వ తేదీన మూడో తరగతి విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఆమె.. ఆపై చిన్నారులకు ప్రశ్నలు అడిగింది. ముఖ్యంగా ముందురోజు చెప్పిన హిందీ కవితను నేర్చుకురమ్మని వివరించింది. ఈక్రమంలోనే ఓ బాలుడిని లేపి అది చెప్పమని కోరింది. కానీ బాలుడికి ఆ కవిత రాదు. దీంతో అతడు నోరు మెదపలేదు.
కవిత చెప్పలేదని ఇష్టం వచ్చినట్లుగా కొట్టిన టీచర్...!
ఎంత అడిగినా చెప్పకపోయేసరికి తీవ్ర కోపోద్రేకానికి గురైన ఉపాధ్యాయురాలు విద్యార్థిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టింది. కర్రతో పలుమార్లు కొట్టి ఆపై మరోసారి నిన్ను బడికి రానివ్వనంటూ బెదిరించింది. దీంతో విపరీతంగా భయపడిపోయిన ఓ బాలుడు రోజంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఇంటికి వెళ్లాక కూడా కన్నీళ్లు పెట్టుకోగా.. గుర్తించిన తల్లిదండ్రులు ఏమైందని అడిగారు. అప్పుడే హిందీ కవిత చెప్పనందుకు టీచర్ కొట్టినట్లు వివరించాడు. పద్యం చెప్పనందుకు ఒళ్లంతా వాతలు వచ్చేలా కొట్టడం ఏంటంటూనే తల్లిదండ్రులు బడికి వెళ్లారు.
సస్పెండ్ చేసిన యాజమాన్యం
ఇదే విషయాన్ని లేఖలో వివరిస్తూ.. సదరు ఉపాధ్యాయురాలిపై పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఈక్రమంలోనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.జి సుబ్రమణియన్ అంతర్గత విచారణ చేయించారు. ఉపాధ్యాయురాలు బాలుడిని నిజంగానే కొట్టినట్లు తేలగా.. ఆమెను సస్పెండ్ చేశారు. అయితే ఆ పాఠశాల సీబీఎస్ఈకి చెందింది కావడంతో.. జీరో టాలరెన్స్ విధానం అమల్లో ఉంది. ఈక్రమంలోనే ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. హిందీని ఎంతగానో వ్యతిరేకించే తమిళనాడులో ఈ ఘటన జరగడంతో స్థానికులంతా పెద్ద గొడవ చేస్తున్నారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న హిందీ గొడవకు, ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని ప్రిన్సిపల్ చెప్పుకొచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa