ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రయోగాలకు సిద్ధమైన భారత్,,,కీలక ఆటగాళ్లను విశ్రాంతి ఇచ్చే యోచన

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 08:03 PM

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వరుసగా రెండు మ్యాచుల్లో విజయం సాధించిన సెమీస్ చేరిన భారత్.. చివరి లీగ్ మ్యాచుకు సిద్ధమైంది. నేడు దుబాయ్ వేదికగా న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఇప్పటికే సెమీస్ చేరిన నేపథ్యంలో ఈ మ్యాచు తుది జట్టులో భారత్ మార్పులు చేసే అవకాశం ఉంది. గత రెండు మ్యాచుల్లో ఎలాంటి మార్పుల్లేకుండా ఒకే జట్టుతో బరిలోకి దిగింది భారత్. కానీ ఈసారి కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వడంతో పాటు.. రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించాలని భావిస్తోంది.


రోహిత్‌కు విశ్రాంతి..!


పాకిస్థాన్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తొడ కండరాల నొప్పితో ఇబ్బందిపడ్డాడు. దీంతో ఈ మ్యాచు నుంచి అతడికి విశ్రాంతి ఇస్తారనే అంచనాలు ఉన్నాయి. అతడి ప్లేసులో ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచు కూడా ఆడని.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు చోటు కల్పించే అవకాశం ఉంది.


షమీ ప్లేసులో అర్షదీప్..!


గత మ్యాచులో భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ పిక్క నొప్పితో ఇబ్బంది పడ్డాడు. కాసేపు మైదానాన్ని కూడా వీడాడు. ఈ నేపథ్యంలో సెమీస్‌కు ముందు అతడికి తగినంత విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావిస్తోందట. ఒకవేళ షమీకి విశ్రాంతి ఇస్తే.. భారత టీ20 స్పెషలిస్ట్ బౌలర్ అర్షదీప్ సింగ్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.


వరుణ్ చక్రవర్తి ఎంట్రీ..


ఫామ్‌లో ఉన్న వరుణ్ చక్రవర్తిని భారత జట్టు.. యశస్వి జైశ్వాల్‌కు బదులు టోర్నీకి ఎంపిక చేసింది. అయితే కుల్‌దీప్ సహా ఇతర స్పిన్నర్లు రాణిస్తుండటంతో అతడికి తుది జట్టులో చోటు దక్కలేదు. కానీ కివీస్‌తో మ్యాచులో కుల్‌దీప్‌కు విశ్రాంతి ఇచ్చి.. వరుణ్ చక్రవర్తిన జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ దుబాయ్ వేదికగా ప్రారంభం కానుంది.


భారత తుది జట్టు అంచనా:రోహిత్ శర్మ/ రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa