ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్-కివీస్ మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా

sports |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 08:04 PM

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో నేడు చివరి గ్రూప్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా ఆదివారం భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లూ కూడా సెమీస్ చేరాయి. అయితే పాయింట్ల పట్టికలో అగ్రస్థానం, రెండో స్థానంలో ఎవరు నిలుస్తారనేది ఈ మ్యాచు ఫలితంతో తేలిపోనుంది. గ్రూప్-బి నుంచి దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటికే సెమీస్ చేరాయి. దీంతో సెమీస్‌లో ఏ జట్టు.. ఎవరితో తలపడుతుందనేది? ఇవాళ్టి ఫలితంతో తేలిపోనుంది.


ఈ టోర్నీలో ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ ఇరు జట్లూ విజయం సాధించాయి. పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లను ఓడించాయి. కాగా గత రెండు మ్యాచుల్లో భారత్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఈ మ్యాచులోనూ అదే పునరావృతం చేయాలని పట్టుదలతో ఉంది. అటు కేన్ విలియమ్సన్, విల్ యంగ్, టామ్ లేథమ్, డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందనే అంచనాలు ఉన్నాయి.


పిచ్ పరిస్థితి ఏంటి?


దుబాయ్ పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామం అని చెప్పొచ్చు. ఈ టోర్నీలో ఇక్కడ ఇప్పటివరకు స్పిన్నర్ల ఎకానమీ 4.36గా ఉంది. ఔట్ ఫీల్డ్ పెద్దది కావడంతో భారీ స్కోర్లు నమోదు కావడం లేదు. గత రెండు మ్యాచుల్లో ఇక్కడ 228, 241 రన్స్ నమోదు అయ్యాయి.


హెడ్ టు హెడ్ రికార్డ్స్..


భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇప్పటివరకు 118 వన్డే మ్యాచులు జరిగాయి. అందులో భారత్ 60 మ్యాచుల్లో గెలిచింది. కివీస్ 50 మ్యాచుల్లో విజయం సాధించింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఏడు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఒకే మ్యాచులో న్యూజిలాండ్ విజయం సాధించింది.


దుబాయ్ వాతావరణం ఎలా ఉంది?మ్యాచ్ వేదిక అయిన దుబాయ్‌లో నేడు చక్కగా ఎండ కాస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. మ్యాచ్ సాఫీగా సాగుతుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa