ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇలా చేస్తే ఎక్కువ నూనె పీల్చకుండా పూరీలు మెత్తగా

Life style |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 10:44 PM

కొందరు బయట తిన్నా సరే నూనెను తల్చుకుని పూరీలు ఆర్డర్ ఇవ్వడానికి జంకుతారు. అయితే, కొన్ని ఇంటి చిట్కాలతో పూరీలు ఎక్కువ నూనె పీల్చకుండా మెత్తగా వస్తాయి. ఆ చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


ఇడ్లీ, దోసె, ఉప్మా ప్రతి ఇంట్లో కామన్‌గా చేసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లు. ఇక, చాలా మంది సండే లేదంటే పండుగలప్పుడు పూరీలు చేసుకుని ఆస్వాదిస్తారు. వేడి వేడి పూరీ తినడానికి ఎవరు ఇష్టపడరు. అయితే, పూరీలు చేసినప్పుడు ఎక్కువ సార్లు అవి నూనెను పీల్చుకుంటాయి. దీంతో, ఆయిలీ పూరీలను తినడానికి చాలా మంది వెనుకాడతారు. ఇక, బరువు తగ్గాలనుకునేవారు రుచిగా ఉన్నా సరే వీటి జోలికి పోరు. కొందరు బయట తిన్నా సరే నూనెను తల్చుకుని పూరీలు ఆర్డర్ ఇవ్వడానికి జంకుతారు. అయితే, కొన్ని ఇంటి చిట్కాలతో పూరీలు ఎక్కువ నూనె పీల్చకుండా మెత్తగా వస్తాయి. ఆ చిట్కాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.


శనగపిండి


సాధారణంగా గోధుమ పిండిని కలుపుకుని పూరీలు చేసుకుంటారు. అయితే, నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలంటే గోధుమ పిండిని కలిపేటప్పుడు దాంట్లో కొంచెం శనగపండిని కూడా కలపండి. దీంతో పూరీలు క్రిస్పీగా, మెత్తగా వస్తాయి. అంతేకాకుండా పూరీలు ఎక్కువ నూనెను పీల్చుకోవు. అలాగే, పూరీలు వేయించేటప్పుడు నూనెను బాగా వేడి చేయాలని గుర్తించుకోండి. అప్పుడు పూరీలు బాగా పొంగుతాయి.


ఫ్రిజ్‌లో పెట్టడం


ఇందుకోసం ముందుగా పిండిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత పిండితో చిన్న చిన్న బంతులు చేసుకోవాలి. బంతుల్ని పూరీ ఆకారంలో రుద్దుకోవాలి. ఆ తర్వాత వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకుని ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల తర్వాత ఈ పూరీల ప్లేట్‌ని బయటకు తీయండి. రెండు నిమిషాలు ఆగి, వేడి నూనెలో వేయించాలి. ఈ చిట్కా ఫాలో అవ్వడం ద్వారా పూరీలు పాన్‌లోని నూనెను తక్కువగా గ్రహిస్తాయి. అంతేకాకుండా మృదువుగా కూడా ఉంటాయి.


ఉప్మా రవ్వ


ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలోకి గోధుమ పిండి, మూడు నుంచి నాలుగు స్పూన్ల ఉప్మా రవ్వ, ఒక చెంచా పంచదార, కాస్తా నూనె వేసుకుని బాగా మిక్స్ చేయాలి. పిండి కలిపేటప్పుడు కాస్త గోరు వెచ్చని నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. నీళ్లు ఒకే సారి పోయకుండా కాస్త కాస్త పోసి కలుపుకుంటే మంచిది. ఇలా రెడీ చేసుకున్న పిండిని అరగంట సేపు పక్కన పెట్టాలి. అరగంట తర్వాత మరోసారి పిండిని బాగా కలుపుకోవాలి. పూరీ పొంగడం కోసం కాస్త మందంగా పిండిని ఒత్తుకోండి. దీంతో పూరీలు ఎక్కువ నూనెను పీల్చవు. అంతేకాకుండా అవి క్రిస్పీగా ఉంటాయి.


పెరుగు


ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో పిండిని తీసుకోండి. ఈ పిండిలో కొంచెం నూనె, కొంచెం పెరుగు కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. ఇప్పుడు గోరువెచ్చని నీటితో పిండిని పిసికి కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక గుడ్డతో కప్పి, కొంతసేపు పక్కన పెట్టుకోండి. కనీసం 15 నిమిషాల తర్వాత, పిండి ఉండలుగా చేసుకోని, కొంచెం నూనె రాసి, వాటిని పూరీ షేపులోకి చేసుకోండి. వాటిని ఇప్పుడు ఎక్కువ కాగిన నూనెలో వేయించండి. దీంతో పూరీలు మెత్తగా, క్రిస్పీగా ఉండటమే కాకుండా ఎక్కువ నూనెను పీల్చవు.


పూరీలు ఇలా కాల్చుకోండి


కడాయిలో పూరీలు పూర్తిగా మునిగిపోయేలా నూనె పోసుకోండి. మంట ఎక్కువగా ఉండేలా చూసుకోండి. మంట తక్కువగా ఉంటే పూరీలు ఎక్కువ నూనెను పీల్చుకోవడమే కాకుండా ఎక్కువగా పొంగవు. ఒత్తుకున్న పూరీలను ఒక్కొక్కటిగా నూనెలో వేసి వాటిని పైన జల్లెడతో సున్నింగా వత్తాలి. దీంతో పూరీలు బాగా పొంగుతాయి. అంతేకాకుండా ఎక్కువ నూనెను పీల్చుకోవు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa