ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏకగ్రీవమైన జీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘం ఎన్నికలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 09:06 AM

పలాస జీడిపప్పు ఉత్పత్తిదారుల సంఘం(పీసీఎంఏ) ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తం కార్యవర్గం అంతా టీడీపీ మద్దతుదారులే కావడం గమనార్హం. ఈ ఎన్నికలు ఈ నెల 4న జరగాల్సి ఉంది. అందుకోసం ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఆదివారం చివరి తేదీ కావడంతో అంతా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఆదివారం ఉదయం 11గంటలకు అభ్యర్థులు మల్లా సురేష్‌కుమార్‌, కేవీ శివకృష్ణ, పట్నాన రవికాంత్‌ నాటకీయ పరిణామాల మధ్య నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో అధ్యక్షుడిగా మల్లా శ్రీనివాసరావు, కార్యదర్శి టంకాల రవిశంకర్‌గుప్తా, కోశాధికారి మల్లా సంతోష్‌కుమార్‌ ఎంపిక లాంఛనమైంది. ఈ ఎన్నికల ఏకగ్రీవమైనట్టు ఎన్నికల కమిటీ సభ్యులు మల్లా భాస్కరరావు, బెల్లాల నారాయణరావు, తర్లాన రమేష్‌ ప్రకటించారు. మొత్తం ఎనిమిది మంది నామినేషన్లు వేయగా ఐదుగురు ఉపసంహరించుకున్నట్లు వారు తెలిపారు. రెండేళ్లపాటు కొత్త కార్యవర్గం కొనసాగుతుంది. పార్టీలకు అతీతంగా వ్యాపారుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని, తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న వ్యాపారులకు అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు ధన్యవాదాలు తెలిపారు. నూతన సంఘాన్ని జిల్లా రైస్‌మిల్లర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి శాసనపురి మురళీకృష్ణ, పారిశ్రామికవాడ వ్యాపార సంఘ అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు అభినందించారు. అలాగే ఏపీటీపీసీ చైర్మన్‌ వజ్జ బాబూరావు, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి లొడగల కామేశ్వరరావుయాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్‌రావు, కార్యనిర్వాహక కార్యదర్శి గాలి కృష్ణారావు, సీనియర్‌ కౌన్సిలర్‌ గురిటి సూర్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు బడ్డ నాగరాజు, కార్యదర్శి సప్ప నవీన్‌, జోగ మల్లి, అంబటి రామకృష్ణ, కొత్త సత్యం, దడియాల నర్సింహులు కూడా కార్యవర్గాన్ని అభినందించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa