కర్నూలు జిల్లాలో ఏకైక అతిపెద్ద జలాశయం గాజులదిన్నె ప్రాజెక్టు (జీడీపీ) గరిష్ఠ నీటి మట్టం 377 మీటర్లు. పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 4.5 టీఎంసీలకు 2.62 టీఎంసీల నిల్వ ఉంది. సాగుకు పోను మరో 1 టీఎంసీ వేసవి అవసరాలకు అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. కర్నూలు నగరంతో పాటు కోడుమూరు, డోన్, క్రిష్ణగిరి, బండకట్టు సమగ్ర నీటి పథకాలకు ఇబ్బంది ఉండదని ఇంజనీర్లు అంటున్నారు. కాగా, తుంగభద్ర జలాశయంలో ఈ ఏడాది నీటి నిల్వలు ఆశాజనకంగా ఉన్నాయి. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలకుగాను ప్రస్తుతం 32.49 టీఎంసీలు నీటి నిల్వ ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa