ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఈ జాగ్రత్తలు తీసుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 06:11 PM

తిరుమల శ్రీవారి భక్తుల్ని చిరుతల సంచార కలవరపెడుతోంది. ఇటీవల కాలంలో వరుసగా చిరుతలు తిరుమలకు వెళ్లే నడకదారుల్లో సంచరిస్తున్నాయి. తాజాగా మరోసారి అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం కలకలంరేపింది. అలిపిరి మార్గంలో గాలిగోపురానికి సమీపంలో చిరుత సంచరించింది.. ఈ మేరకు ఆ పక్కనే ఉన్న షాపులోని సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి. ఓ పిల్లి వెళుతుండగా.. చిరుత వేటాడి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లినట్లు గుర్తించారు. మంగళవారం వేకువజామున 1 గంట సమయంలో సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డయ్యాయి. సీసీ ఫుటేజ్ చూసిన షాపుల్లోని వాళ్లు హడలిపోయారు. వెంటనే చిరుత సంచారానికి సంబంధించి అటవీశాఖ అధికారులు, టీటీడీ విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు తిరుపతిలోని జూ రోడ్డులో కూడా చిరుత సంచారం కలకలంరేపింది.


అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారంతో టీటీడీ విజిలెన్స్‌ అధికారులు అప్రమత్తం అయ్యారు. వెంటనే అలిపిరి నడకమార్గంలో తిరుమలకు వెళ్తున్న భక్తులను అప్రమత్తం చేశారు. ఈ మేరకు ఈ మార్గంలో మధ్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్ల లోపు చిన్న పిల్లలను తీసుకెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటల అనంతరం భక్తులు గుంపులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ అధికారులు సూచించారు. అయిత చిరుత సంచారంతో భక్తులు, ప్రజలు ఆందోళనలో ఉన్నారు.


గత నెలలో కూడా తిరుమల నడకమార్గంలో చిరుతల సంచారం కలకలంరేపింది. అలిపిరి నడక మార్గంలోని ముగ్గుబావి దగ్గర చిరుతను భక్తులు గుర్తించి అటవీశాఖ, టీటీడీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకుని పెద్ద శబ్దాలు చేయడంతో చిరుత అక్కడి నుంచి పారిపోయి అడవిలోకి వెళ్లిపోయింది. చిరుత సంచారంతో టీటీడీ, అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమై భక్తులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. తాజాగా మరోసారి చిరుత కనిపించడంతో టీటీడీ భక్తుల్ని అలర్ట్ చేసింది. ఇలా వరుసగా చిరుతల సంచారంతో భక్తులు ఆందోళనలో ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa