ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అనంతపురం వద్ద రెండు లారీలు ఢీ.. ఒకరి మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 04, 2025, 06:34 PM

అనంతపురం నగర శివారులో మంగళవారం ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు నుంచి మరోలారీ అతివేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన లారీ డ్రైవర్ రాహిల్ అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు వివరించారు.
గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బెంగళూరు నుంచి రాజస్థాన్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa