టీమిండియా మాజీ కోచ్, లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే టీమిండియా ప్లేయింగ్ 11పై తన అభిప్రాయాలు వెల్లడించాడు. రోహిత్ శర్మ నలుగురు స్పిన్నర్లతోనే ఆస్ట్రేలియాపై బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్పాడు. కీలకమైన ఈ సెమీ ఫైనల్స్లో వరుణ్ చక్రవర్తిని కచ్చితంగా ప్లేయింగ్ 11 ఆడిస్తారనే నమ్మకంతో ఉన్నాడు. జట్టు ఎంపికలో కాస్త అటూ ఇటూ అయితే ఫ్యాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంటుందని ఆలోచించినా నాలుగో స్పిన్నర్తో బరిలోకి దిగే అవకాశం ఉందని కుంబ్లే చెప్పాడు.
గ్రూప్ స్టేజ్లో న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించాడు. ఐసీసీ టోర్నీల్లో ఎంట్రీ ఇచ్చిన తొలి మ్యాచ్లోనే ఐదు వికెట్లు తీసుకుని రికార్డు సృష్టించాడు. కీలక సమయాల్లో వికెట్లు తీసి భారత్ జట్టు అందించిన 250 పరుగుల టార్గెట్ను న్యూజిలాండ్ ఛేజ్ చేయకుండా కట్టడి చేశాడు. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి 42 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు.
"నేనయితే పిచ్లో మార్పులు ఉంటాయని అనుకోవడం లేదు. న్యూజిలాండ్తో ఆడిన మ్యాచ్లో పిచ్కి ఈరోజు మ్యాచ్కి తేడా ఉంటుందని అనుకోవడం లేదు. టీమిండియా వరుణ్ చక్రవర్తిని నాలుగో స్పిన్నర్గా ప్లేయింగ్ 11లో ఉంచుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ జట్టులో ఏదైనా ఛేంజ్ ఉంటే బహుశా అది కూడా మహమ్మద్ షమీ. అతని భుజానికి దెబ్బ తగిలింది. కానీ బౌలింగ్లో మాత్రం ఎలాంటి ఇబ్బంది పడలేదు. అదయితే పెద్ద సమస్యగా నేననుకోవడం లేదు. ఆస్ట్రేలియా మీద టీమిండియా ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పు ఉండదని నేను అనుకుంటున్నాను" అని కుంబ్లే అన్నాడు.
"దుబాయ్ పిచ్లపై టీమిండియా నలుగురు స్పిన్నర్లు అద్భుతంగా రాణిస్తారు. ఈ నలుగురు స్పిన్నర్లు సులభంగా నలభై ఓవర్లు బౌలింగ్ చేయగలరు. దానికతోడు మనకు మరో ఇరవై ఓవర్లు పేస్ బౌలింగ్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ విషయంలో టీమిండియా ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు" అని కుంబ్లే తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa