26/11 ముంబుయి ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి తహవూర్ రాణాను భారత దేశానికి అప్పగిస్తామని ఇటీవలే ట్రంప్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మరికొద్ది రోజుల్లోనే అతడు ఇండియాకు వస్తాడని అంతా అనుకుంటుండగా.. నిందితుడు మరోసారి యూఎస్ సుప్రీం కోర్టును ఆశ్రయించాడు. ముఖ్యంగా తనను భారత్కు అప్పగిస్తే చిత్రహింసలు పెట్టి నరకం చూపిస్తారని.. అందుకే తనను ఇండియాకు అప్పగించొద్దంటూ పిటిషన్ వేశాడు. తన అప్పగింత కార్యక్రమాన్ని అత్యవసరంగా నిలిపివేయాలని కోరాడు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
తహవూర్ హుస్సేన్ రాణా పుట్టింది పాకిస్థాన్లోనే అయినా కెడనా పౌరసత్వం పొందారు. అయితే 26/11 ముంబయిలో జరిగి ఉగ్రదాడుల్లో ఇతడు కీలక సూత్రధారి. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ జైల్లో శిక్షను అనుభవిస్తున్నాడు. ఈ నిందితుడిని తమకు అప్పగించాలని కోరుతూ భారత దేశం ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తోంది. కానీ అతడు మాత్రం ఇండియాకు రాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నాడు. ముఖ్యంగా భారత్ న్యాయ పోరాటం చేస్తుండగా.. అతడు ఆయా ఫెడరల్ కోర్టుల్లో సవాల్ చేస్తూ తప్పించుకుంటున్నాడు.
ఇప్పటికే తహవూర్ రాణా అనేక ఫెడరల్ కోర్టులను ఆశ్రయించగా.. అవన్నీ అతడి అభ్యర్థలనను తిరస్కరించాయి. ఈక్రమంలోనే అతడు శాన్ ఫ్రాన్సిస్కోలోని అమెరికా కోర్టుకు వెళ్లగా.. అక్కడ కూడా చుక్కెదురు అయింది. దీంతో గతేడాది నవంబర్ 13వ తేదీన అమెరికా సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేశాడు. దాన్ని కొట్టివేయాలని కోరుతూ అమెరికా ప్రభుత్వం న్యాయస్థానికి విజ్ఞప్తి చేసింది. మొత్తంగా 20 పేజీల అఫిడవిట్ను దాఖలు చేసింది. దాన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు.. తహవూర్ రాణా అభ్యర్థనను కొట్టేసింది.
దీంతో అతడు త్వరలోనే భారత దేశానికి తిరిగి వస్తాడని అంతా అనుకున్నారు. ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా వివరించారు. మరికొద్ది రోజుల్లోనే అతడిని భారత్కు అప్పజెబుతానని వెల్లడించారు. దీంతో భయపడిపోయిన తహవూర్ రాణా మరోసారి సుప్రీం కోర్టుకు వెళ్లారు. మరి ఈసారి న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa