దక్షిణ కొరియా వాయుసేన చేపట్టిన శిక్షణా కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. శత్రువులపై బాంబు దాడులు చేసేందుకు వెళ్లిన యుద్ధ విమానాలు.. పొరపాటున సొంత ప్రజలపైనే బాంబులు వేశాయి. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంలో మొత్తంగా ఏడుగురు గాయపడ్డారు. ఇందులో నలుగురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉండగా.. మరో ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. అసలు అనుకోకుండా ఈ బాంబులు ఎలా జారపడ్డాయి, అందుకు గల కారణాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దక్షిణ కొరియా - అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల మధ్య శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు ఉదయం 10 గంటలకు సియోల్ ఫైటర్ జైటె కేఎఫ్-16 పోచెయోన్ స్థావరం నుంచి 8 ఎంకే-82 శ్రేణి బాంబులతో బయలు దేరింది. అయితే ఉత్తర కొరియా సరిహద్దలకు 25 కిలో మీటర్ల దూరంలో ఈ బాంబులను జారి విడవాలి. కానీ ఇవి ఫైరింగ్ రేంజిలో నిర్దేశించిన టార్గెట్లపై కాకుండా.. పొరపాటున సమీప గ్రామంలోని జనావాసాలపై పడ్డాయి. ఈక్రమంలోనే ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అనేక భవనాలు కాలి బూడిదయ్యాయి.
విషయం గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి.. సంఘటనా స్థలం వద్దకు అగ్నిమాపక సిబ్బందిని పంపించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఇందులో నలుగురు పరిస్థితి విషమంగా ఉండగా.. మరో ముగ్గురి పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఈ ప్రమాదంపై స్పందించిన వాయుసేన అధికారులు.. బాధితులను ఆస్పత్రులకు తరలించామని చెప్పారు. దీనిపై యాక్సిడెంట్ రెస్పాన్స్ కమిటీ విచారణ జరుతుందని.. బాధ్యులపై చర్యలు కూడా తీసుకుంటుందని వెల్లడించారు.
ఈ ఘటన చాలా విచారకరం అని చెబుతూనే.. బాంబు దాడుల వల్ల జరిగిన ఆస్తి నష్టానికి పరిహారం చెల్లిస్తామని వివరించారు. ఇదంతా ఇలా ఉండగా.. అనుకోకుండా పడిన బాంబుల వల్ల స్థానిక ప్రజంలతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లన్నీ కంపించపోయాయని.. ఏం జరిగిందో తెలిసేలోపే చాలా భవనాలు అగ్నికి ఆహుతి అయ్యాయని చెబుతున్నారు. ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. కాస్త చూస్కోవాలి కదా బ్రో, ఏంటిది అంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.
దక్షిణ కొరియాలో ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా సైన్యంలో ఇలాంటివి చాలానే జరిగాయి. ముఖ్యంగా 2022లో ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలకు దీటుగా స్పందించేందుకు సియోల్ కూడా హ్యూన్మూ-2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇవి పొరపాటున మార్గం తప్పి సమీపంలో గోల్ఫ్ కోర్టులో పడగా.. మైదానం పూర్తిగా ధ్వంసం అయిపోయింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa