పొట్టకూటి కోసం కొందరు.. తమ దేశంలో పని దొరక్క మరికొందరు.. అందమైన భవిష్యత్తు ఊహించుకుని ఇంకొందరు.. దేశం దాటి ఇతర దేశాలకు వెళ్తుంటారు. ఇందులో చాలా మంది సక్రమ మార్గాల్లో వెళ్తుంటే.. కొందరు మాత్రం అక్రమంగా ఇతర దేశాల్లోకి ప్రవేశిస్తుంటారు. ఇందుకోసం అధికారుల కంట పడకుండా ఉండేందుకు ప్రమాదకర మార్గాల గుండా ప్రయాణిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. తాజాగా కొందరు ఇలాంటి దారిగుండే వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. మొత్తంగా 188 మంది గల్ఫ్ దేశాలకు 4 పడవల్లో వెళ్తుండగా అవి బోల్తా పడ్డాయి. ఫలితంగా వారంతా గల్లంతు అయ్యారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
యెమెన్, బిజౌటి తీర ప్రాంతాల మధ్య ఉన్న సముద్ర మార్గం గుండా కొందరు అక్రమంగా గల్ఫ్ దేశాలకు వెళ్లాలనుకున్నారు. ఇది చాలా ప్రమాదకరమైన మార్గం అని తెలిసినప్పటికీ 4 పడవల ద్వారా 188 మంది ప్రయాణం ప్రారంభించారు. కానీ దురదృష్టవశాత్తు అలలు ఎక్కువై ఆ పడవలు బోల్తా పడ్డాయి. ఫలితంగా వారంతా నీళ్లలో మునిగిపోయారు. ఇందులో ఇద్దరు చనిపోగా.. మరో 186 మంది గల్లంతు అయ్యారు. ఈ విషయాన్ని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ మీడియాకు తెలిపింది.
అయితే గల్లంతు అయిన 186 మంది కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని వివరించింది. ఇందులో మృతుల సంఖ్య కాస్త ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. ఇథియోపియాకు చెందిన ప్రజలు ఎక్కువగా ఈ మార్గం గుండా గల్ఫ్ దేశాలకు అక్రమంగా వలస వెళ్తుంటారు. ఇది ప్రంపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వలస మార్గం. ఇక్కడ ప్రమాదం జరగడం ఇదే తొలిసారి కాదు. రెండు నెలల క్రితం కూడా ఇలాంటి ప్రమాదమే సంభవించింది.
ముఖ్యంగా 2025 జనవరి నెలలో యెమెన్ తీరంపో పడవ మునగడంతో సుమారు 20 మంది ఇథియోపియా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2024 సంవత్సరంలో కూడా ఈ మార్గం గుండా అనేక మంది ప్రయాణించారు. మొత్తంగా 558 మంది చనిపోయారు. అయినప్పటికీ.. ఈ దారి గుండా అక్రమ వలసలు ఆగట్లేదు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa